ట్రాక్టర్, బైక్‌ ఢీ..ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, బైక్‌ ఢీ..ఒకరి మృతి

Published Thu, Jun 25 2015 9:00 AM

road accident at krishna distirict

కంచికచర్ల:  కృష్ణా జిల్లా కంచికచర్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది.వివరాలు కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన రాంబాబు(26), అతని స్నేహితునితో కలిసి బైక్ మీద కంచికచర్ల నుంచి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో బంక్ సెంటర్‌లో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న రాంబాబు అక్కడికక్కడే మృతిచెందగా.. అతని స్నేహితుడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని విజయవాడ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement