చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Thu, Feb 26 2015 4:21 AM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

 పిచ్చాటూరు: చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. శ్రీకాళహస్తి నుంచి పదిమంది ప్రయాణికులతో షేర్ ఆటో కేవీబీపురానికి బయలుదేరింది. కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద పిచ్చాటూరు నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న లారీ రాంగ్ రూట్‌లో వస్తుండడం గమనించి ఆటోను డ్రైవర్ పక్కకు తిప్పాడు. ఆటో ఒక్కసారిగా పక్కకు రావడంతో లారీ డ్రైవర్ తికమకపడి ఆటోను ఢీకొట్టాడు.
 
 ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన చెంగయ్యు(25), మఠం గ్రామానికి చెందిన ఉష(35), సబ్బులక్ష్మి(55), దిలీప్(3), జ్ఞానమ్మకండ్రిగకు చెందిన పద్మ(50), కళత్తూరుకు చెందిన భూపతవ్ము(50), ఓళూరు గ్రామానికి చెందిన రాజయ్యు(25) అక్కడికక్కడే వుృతిచెందారు. వురో వుుగ్గురు తీవ్ర గాయూపడ్డారు. మృతుల్లో ఉషా, సుబ్బులక్ష్మి, దిలీప్ ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడంతో వుృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి.   క్రేన్ రప్పించి మృతదేహాలను వెలికితీశారు.
 

Advertisement
Advertisement