బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ | Sakshi
Sakshi News home page

బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ

Published Fri, Oct 2 2015 1:17 PM

robbery at eluru in west godavari

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ఆదివారపు పేట పెన్షన్‌లైన్‌లో చోరీ జరిగింది. స్థానికంగా ఉండే ఇండియన్ బ్యాంకు మేనేజర్ బీవీ సుగుణ దాస్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ చోరీ జరిగింది. ఇంట్లో అంతా నిద్రపోతుండగా దొంగ వెనక వైపు నుంచి చొరబడ్డాడు. అలికిడి కావడంతో బ్యాంకు మేనేజర్ కుమార్తె నిద్ర లేచింది. దొంగను చూసి అరవడంతో పరారయ్యాడు. ఇంట్లో ఉన్న రూ.లక్షన్నర నగదు, పదికాసుల బంగారు గొలుసు చోరీకి గురైనట్టు బాధితులు గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement