ఏలూరు (టూటౌన్), న్యూస్లైన్ : ఆస్తి విషయంలో భార్య, కుమారుడు, బంధువులు తనను వేధిస్తున్నారని.. తనను కొట్టారని.. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ చుట్టూ ఐదు రోజులపాటు తిరిగిన ఓ వృద్ధుడు చివరకు ఆ స్టేషన్ ఎదుటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న దర్గా వద్ద శని వారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు విచారణలో ఎస్సై నిర్లక్ష్యమే ఆత్మహత్యకు కారణమని అతని పెద్దకుమార్తె, అల్లుడు ఆరోపిస్తున్నారు. మృతుడి పెద్ద కుమార్తె, అల్లుడు తెలిపిన వివరాల ప్రకారం..
ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రుకు చెందిన జయమంగళ బంగార్రాజు (70) రైతు. అతనికి భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె సీతారామలక్ష్మికి మాజీ సర్పంచ్ ఘంటసాల దుర్గరావుతో వివాహం చేశాడు. ఏడు నెలల క్రితం బంగార్రాజుకు భార్యతో విభేదాలు రావడంతో అతను పెద్దకుమార్తె ఇంటికి వెళ్లి ఉంటున్నాడు. అతనికి గల ఎకరం 60 సెంట్ల భూమిని గతంలోనే నాలుగు వాటాలు వేసి కుమారుడు, ఇద్దరు కుమార్తెలకు 40 సెంట్ల చొప్పున రాశాడు. మిగిలిన 40 సెంట్లు తన పేరున అట్టేపెట్టుకున్నాడు. ఇటీవలే అతను ఆ 40 సెంట్ల భూమిని పెద్దల్లుడు, కుమార్తె పేరిట రాశాడు. ఆ భూమిని తమకు చెప్పకుండా వారికి ఎందుకు రాశావని భార్య , కుమారుడితోపాటు బంధువులు వేధిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అతడిని కొట్టడంతో ఈనెల 10న ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో బంగార్రాజు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు స్పందించ లేదు. ప్రతిరోజు అతను స్టేషన్కు వస్తున్నాడు. శనివారం ఉదయం కూడా స్టేషన్కు వచ్చాడు. స్టేషన్లో సిబ్బంది మొత్తం కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పర్యటన సందర్భంగా బందోబస్తుకు వెళ్లారు. ఐదు రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారేకానీ స్పందించటం లేదని మనస్తాపం చెం దిన బంగార్రాజు శనివారం ఉదయం సుమారు 10 గంటలకు రూరల్ పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న దర్గా వద్ద కూర్చుని పురుగు మందు తాగి అక్కడే పడుకుండిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందిచారు. వారు వచ్చే సరికే అతను మృతిచెందడంతో పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బంగార్రాజు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం : రూరల్ ఎస్సై
బంగార్రాజు ఫిర్యాదు మేరకు శ్రీపర్రు గ్రామంలో విచారణ చేపట్టామని రూరల్ స్టేషన్ ఎస్సై జి.ఫణీంద్ర తెలిపారు. శుక్రవారం రాత్రి సీఐ ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారని చెప్పారు. బంగార్రాజు ఫిర్యాదు మేరకు అతని భార్య వెంకటేశ్వరమ్మ, కుమారుడు దుర్గారావు, బంధువులు జయమంగళ రాంబాబు, ఆయన భార్య అంజలి, సీతారామాంజనేయులు, లక్ష్మి, మరొకరిపై కేసు నమోదు చేశామని రూరల్ సీఐ శుభాకర్ తెలిపారు. కేసు విచారణ విషయంలో ఎస్సై నిర్లక్ష్యమే బంగార్రాజు మృతికి కారణమని అతని పెద్దకుమార్తె, అల్లుడు ఆరోపిస్తున్నారు.
పోలీసుల నిర్లక్ష్యానికి వృద్ధుడి బలి
Published Sun, Feb 16 2014 1:49 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement