Sakshi News home page

'ఓటింగ్పై ఇప్పటికైనా స్పష్టత ఇవ్వండి'

Published Thu, Jan 23 2014 12:09 PM

'ఓటింగ్పై ఇప్పటికైనా స్పష్టత ఇవ్వండి' - Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ్ బిల్లు ఓటింగ్పై స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఓటింగ్ ఉంటుందో లేదో...ఇప్పటికైనా స్పష్టం చేయాలని ఆమె స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కోరారు. వ్యక్తిగతంగా తీర్మానాలు ఇచ్చినా, సిఎం తీర్మానం పెట్టినా ఓటింగ్‌కు అనుమతి ఇస్తామని చెప్పారు, మరి అలా చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు.

సభలో జరుగుతున్న అంశంపై బయట ఎవ్వరికీ స్పష్టత లేదని విజయమ్మ స్పీకర్‌ దృష్టికి తెచ్చినప్పటికీ..ఓటింగ్‌పై స్పీకర్‌ స్పష్టత ఇవ్వలేదు.  మరోవైపు.. సీఎం ప్రసంగం పూర్తి అయిందా లేదా స్పష్టత ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్‌ స్పీకర్‌ను కోరగా.. సీఎం ప్రసంగం పూర్తి కాలేదని ఆయన ప్రసంగం కొనసాగుతుందని స్పీకర్‌ తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement