ఉన్నతాధికారులతో బాబు
విభజన వల్ల నష్టాలను పూడ్చే మార్గాలను అన్వేషించండి
కేంద్రం నుంచి ఎక్కువ నిధులు పొందే అవకాశాలు చెప్పండి
సీఎస్, ఉన్నతాధికారులను కోరిన కాబోయే సీఎం
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధులు సమకూర్చుకునే మార్గాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు టీడీపీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు అజయ్ కల్లం, పి.వి.రమేష్ , కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి, అదనపు కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు శుక్రవారం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు తదితర అంశాలపై రమేష్, రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను వివరించారు. విభజన తర్వాత రాష్ట్ర ఆదాయ పద్దు ఎలా ఉంటుందనే అంచనాలను వివరించారు. ‘రాష్ట్ర విభజన జరిగింది. ఇక దీనిపై మాట్లాడేదేముంది? విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఆ నష్టాలను పూడ్చే మార్గాలు అన్వేషించండి. ఎక్కడెక్కడ ఎలాంటి నష్టం జరిగింది.. దీనికి ప్రత్యామ్నాయాలేమిటో మీరు ఆలోచించండి.’ అని చంద్రబాబు వారికి సూచించినట్లు తెలిసింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, వాటి అమలుకు నిధులు సమకూరే మార్గాలను అన్వేషించాలని వారిని కోరినట్లు సమాచారం.
కొత్త రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి వల్ల కలిగే ప్రయోజనాలు, దీని ద్వారా నిధులు పొందే మార్గాలను పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ఉన్న మార్గాలను పరిశీలించి నివేదిక ఇవ్వండి. మీరు మార్గాలు చూస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా...’ అని చంద్రబాబు పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్యోగుల విభజన విషయంలో ఎవరికీ అన్యాయం జరుగకుండా చూడాలని.. వీలైనంత త్వరగా కొత్త రాజధానికి వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా బాబు పేర్కొన్నట్లు చెప్తున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా కేంద్రాన్ని ఇప్పుడే కొత్త చోటుకు తీసుకెళ్లడం వీలుకాదని, రాజధానికి అవసమైన వసతులు సమకూర్చడానికి కనీసం రెండేళ్లు పడుతుందని, అప్పటి వరకూ హైదరాబాద్ నుంచే పాలన కొనసాగించడం ఉత్తమమనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
దారులు చూపండి.. నిధులు నేను తెస్తా!
Published Sat, May 24 2014 12:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement