-
దారులు చూపండి.. నిధులు నేను తెస్తా!
ఉన్నతాధికారులతో బాబు విభజన వల్ల నష్టాలను పూడ్చే మార్గాలను అన్వేషించండి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు పొందే అవకాశాలు చెప్పండి సీఎస్, ఉన్నతాధికారులను కోరిన కాబోయే సీఎం హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధులు సమకూర్చుకునే మార్గాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు టీడీపీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు అజయ్ కల్లం, పి.వి.రమేష్ , కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి, అదనపు కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు శుక్రవారం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు తదితర అంశాలపై రమేష్, రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను వివరించారు. విభజన తర్వాత రాష్ట్ర ఆదాయ పద్దు ఎలా ఉంటుందనే అంచనాలను వివరించారు. ‘రాష్ట్ర విభజన జరిగింది. ఇక దీనిపై మాట్లాడేదేముంది? విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఆ నష్టాలను పూడ్చే మార్గాలు అన్వేషించండి. ఎక్కడెక్కడ ఎలాంటి నష్టం జరిగింది.. దీనికి ప్రత్యామ్నాయాలేమిటో మీరు ఆలోచించండి.’ అని చంద్రబాబు వారికి సూచించినట్లు తెలిసింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, వాటి అమలుకు నిధులు సమకూరే మార్గాలను అన్వేషించాలని వారిని కోరినట్లు సమాచారం. కొత్త రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి వల్ల కలిగే ప్రయోజనాలు, దీని ద్వారా నిధులు పొందే మార్గాలను పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ఉన్న మార్గాలను పరిశీలించి నివేదిక ఇవ్వండి. మీరు మార్గాలు చూస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా...’ అని చంద్రబాబు పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్యోగుల విభజన విషయంలో ఎవరికీ అన్యాయం జరుగకుండా చూడాలని.. వీలైనంత త్వరగా కొత్త రాజధానికి వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా బాబు పేర్కొన్నట్లు చెప్తున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా కేంద్రాన్ని ఇప్పుడే కొత్త చోటుకు తీసుకెళ్లడం వీలుకాదని, రాజధానికి అవసమైన వసతులు సమకూర్చడానికి కనీసం రెండేళ్లు పడుతుందని, అప్పటి వరకూ హైదరాబాద్ నుంచే పాలన కొనసాగించడం ఉత్తమమనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
మెక్కేశారు
సాక్షి, కడప: సమైక్య సమ్మెను ఉపాధి సిబ్బంది సొమ్ము చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన కొరవడటంతో అందిన కాడికి దోచుకున్నారు. కూలీలు పనులకు రాకపోయినా వారి పేరుతో దర్జాగా మస్టర్లు తయారుచేసి బొక్కేశారు. బినామీ, బోగస్ పేర్లతో భూమి అభివృద్ధి పనుల పేరుతో అందిన కాడికి దండుకున్నారు. పనులు కల్పించమని కూలీలు వేడుకున్నా కొన్నిచోట్ల పనులు కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. జిల్లావ్యాప్తంగా సమ్మెకాలంలో జరిగిన పనులపై దృష్టిసారించి లోతైన విచారణ చేపడితే సిబ్బంది గుట్టురట్టవుతుంది. ఇందిర జలప్రభ క్రింద నాటిన మొక్కలు జిల్లాలో దాదాపు కనుమరుగయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రభుత్వమే పండ్ల మొక్కల పెంపకంపై కోత విధించింది. స్మార్ట్కార్డులు ఉన్నప్పటికీ లబ్ధిదారులకు మ్యానువల్గానే చెల్లింపులు చేసి నిధులను మింగేశారు. చివరకు మరుగుదొడ్లను సైతం వదలకుండా పనులు జరగనప్పటికీ పే స్లిప్పులు జారీచేశారు. ‘‘కాశినాయన మండలం గొంటివారిపల్లెకు చెందిన వి.కాశన్న జాబ్కార్డు నంబర్ 10065. ఉపాధిహామీ పథకంలో ఇతనికి మరుగుదొడ్డి మంజూరైంది. ఇతను ఏమీ పని చేయకుండానే ఇతని అకౌంట్ పేర రూ.2,238 మంజూరు చేశారు. కలసపాడు మండలం ఎగువతంబళ్లపల్లె పంచాయతీసింగరాయపల్లె గ్రామానికి చెందిన టి.అన్నపూర్ణమ్మ తన పొలంలో భూమి అభివృద్ధి పని చేయకపోయినా చేసినట్లు వేరే పొలంలో ఆమెను నిలబెట్టి ఫొటో తీసి ఆమె పేరుతో నిధులను స్వాహా చేసినట్లు ఇటీవల సామాజిక తనిఖీల్లో బహిరంగంగా వెల్లడైంది. బి.మఠం మండలంలో ఒకే పేరును మూడు గ్రూపుల్లో రాసుకుని అతనికి ఒక గ్రూపులో డబ్బు ఇచ్చి, మిగతా రెండు గ్రూపుల్లో వచ్చిన సొమ్మును ఉపాధి సిబ్బంది కాజేసినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో ఉపాధిహామీ పథకం తీరు ఇలా.. జిల్లాలో మొత్తం 818 గ్రామ పంచాయతీల్లో 4,241 హ్యాబిటేషన్లు ఉన్నాయి. ఇందులో మొత్తం 5,43,149 జాబ్కార్డులు, 20,187 గ్రూపులు ఉన్నాయి. సగటున రూ.117.62 వేతనం లభిస్తోంది. 17,605 మంది మాత్రమే ఇప్పటికి 100 పని దినాలను పూర్తి చేసుకోగలిగారు. ఈ ఏడాది మొత్తం 89,53,360 పనిదినాలను కల్పించారు. జిల్లాలో మొత్తం 1,84,607 ఇళ్లు ఉండగా, ఇందులో 48.5శాతం మందికి మాత్రమే పనిని చూపించారు. తక్కువ పనిదినాలు కల్పించిన సిబ్బందిపై వేటు : 623 గ్రామ పంచాయతీల్లో 5వేల పనిదినాలు కల్పించిన సీనియర్ మేట్లకు ఫీల్డ్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. 1000 నుంచి 5000 పనిదినాలు కల్పించిన 97 గ్రామ పంచాయతీల్లోని 28మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు సీనియర్ మేట్లుగా రివర్షన్ ఇచ్చారు. 0 నుంచి 1000 పనిదినాలు కల్పించని 56 గ్రామ పంచాయతీల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. కఠిన చర్యలు తప్పవు : మాన్యువల్ పేమెంట్లు లేకుండా పూర్తిగా స్మార్ట్కార్డుల ద్వారా డబ్బు పంపిణీ చేసేందుకు కలెక్టర్, జేసీ ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి పాల్పడినట్లు తేలితే అందుకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పని దినాలు కల్పించడంలో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై వేటు వేస్తున్నాం. ఇందులో భాగంగా కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లకు నోటీసులు జారీచేశాం. బి.మఠం మండలం నరసన్నపల్లెలో ఫీల్డ్ అసిస్టెంట్ పేరుతో మస్టర్లు జారీకావడంతో విచారణ లేకుండానే చర్యలు తీసుకున్నాం. మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. -బాలసుబ్రమణ్యం, డ్వామా పీడీ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement