కేంద్రం ఆదేశాలు.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అమలు పరిధిలో లేనివారికి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం
హైదరాబాద్: కార్మిక రాజ్యబీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలోని ఆస్పత్రులు ఇక అందరివీ కానున్నాయి. త్వరలోనే ఈఎస్ఐ పరిధిలో లేనివారు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందవచ్చు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకూ ప్రైవేటు సంస్థల్లో రూ. 15 వేల లోపు వేతనం ఉన్న ఉద్యోగులు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ఆ ఉద్యోగి కుటుంబంలోని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి, తండ్రి ఈ సేవల పరిధిలో ఉన్నారు. ఇకపై సాధారణ ప్రజలు అంటే ఎలాంటి సంస్థల్లో పనిచేయకపోయినా ఈఎస్ఐ ఆస్పత్రులకెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. రెండు రాష్ట్రాల పరిధిలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు సాధారణ జనానికి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కూడా సాధారణ ప్రజలకు వైద్యసేవలు పొందే అవకాశం కల్పిస్తే ఎంతో కొంత మేలు చేసే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ అభిప్రాయం. అయితే ఈఎస్ఐ పరిధిలో లేని వారి నుంచి సేవను బట్టి యూజర్ చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేన్సర్, కిడ్నీ రోగుల నరకయాతన
ఓవైపు సాధారణ రోగులకూ ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంటే, మరోవైపు రాష్ట్రంలో కేన్సర్, కిడ్నీ రోగులకు మందులే అందడం లేదు. దీంతో ఆ వ్యాధుల బాధితులు నరకం అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితికి ఈఎస్ఐ కార్పొరేషన్, డెరైక్టరేట్ల మధ్య సమన్వయ లోపమే కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఈఎస్ఐ కార్పొరేషన్ కేంద్రం పరిధిలోనూ, డెరైక్టరేట్ రాష్ట్ర పరిధిలోనూ ఉంటుంది. నిబంధనల ప్రకారం కిడ్నీ, కేన్సర్ రోగులు కార్పొరేషన్ పరిధిలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (సనత్నగర్)లో చికిత్స పొందుతారు. అక్కడ ఇన్పేషెంటుగా ఉన్నంత కాలం ఆస్పత్రిలోనే మందులు ఉచితం గా ఇస్తారు. డిశ్చార్జి తర్వాత వారికి డెరైక్టరేట్ పరిధిలోని డిస్పెన్సరీల్లో ప్రతినెలా అవసరమైనన్ని మందులివ్వాలి. కానీ తాము మందులు ఇవ్వలేమని డెరైక్టరేట్ అధికారులు తేల్చిచెబుతున్నారు. ఒక్కో త్రైమాసికానికి మందులకు రూ.3 కోట్లు అవుతోందని, అందువల్ల స్పెషాలిటీ ఆస్పత్రిలోనే మందులు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. డిశ్చార్జి అయ్యాక మందు లు తామిచ్చేదిలేదని స్పెషాలిటీ ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. దీంతో గత రెండు మాసాలుగా కిడ్నీ, కేన్సర్ రోగులు మందులు అందక తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. దీనిపై డెరైక్టరేట్ అధికారులను వివరణ కోరగా దీనిపై ఈఎస్ఐ కార్పొరేషన్కు లేఖ రాయనున్నట్టు తెలిపారు.
త్వరలో అందరికీ ఈఎస్ఐ సేవలు
Published Mon, Oct 13 2014 1:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!
రోల్స్ అమ్ముతున్న జస్ప్రీత్ వీడియో వైరల్ : ఆనంద్ మహీంద్ర సాయం
సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే
నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే
అహ్మదాబాద్లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు
హమ్మయ్యా.. బ్లాక్ బస్టర్ సిరీస్ మూడో సీజన్ మొదలైంది
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement