కశింకోట: మహిళలపై వేధింపులు జరుగుతున్నాయన్న దానికి శ్రీవాణియే నిదర్శనమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. స్థానిక గవరపేట కనకమహాలక్ష్మి వీధిలో అత్తింటివారు కాపురానికి రానీయకపోవడంతో రామాలయంలో తలదాచుకుంటున్న భీశెట్టి శ్రీవాణిని సోమవారం ఆయన పరామర్శించారు. ఆమెకు జరుగుతున్న అన్యాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
శ్రీవాణికి అండగా ఉంటాం
శ్రీవాణికి అండగా నిలిచి న్యాయం చేయడానికి కృషి చేస్తామని అమర్నాథ్ భరోసా ఇచ్చారు. 15 ఏళ్ల కిందట పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న శ్రీవాణిని భర్త, అత్తింటి వారు ఇంట్లోకి రానీయకుండా ఇబ్బందులు పెడుతుండటం శోచనీయమన్నారు. కనీసం పిల్లలను కూడా చూసే అవకాశాన్ని కల్పించకపోవడం సమంజసం కాదన్నారు.ఈ విషయమై పోలీసులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. కాపురానికి వచ్చిన భార్యను ఇంట్లోకి రానీయకుండా అడ్డుకుంటే చుట్టు పక్కల మహిళలు చేరదీయడం అభినందనీయమన్నారు. శ్రీవాణిని రెండు రోజుల వ్యవధిలో కాపురానికి తీసుకెళ్లాలని భర్త తారకేశ్వరరావుకు నచ్చజెబుతానన్నారు. లేదంటే స్థానికుల అండతో ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి శ్రీవాణికి న్యాయం చేకూరుస్తామని అమరనాథ్ పేర్కొన్నారు.
కన్నీళ్ల పర్యంతమైన శ్రీవాణి
కాపురానికి వచ్చిన తనను భర్త, అత్తింటివారు ఇంట్లోకి రానీయలే దని, కనీసం పిల్లలను కూడా చూడనీయలేదని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది.అదనపు కట్నంగా భూమి రాయమని భర్త,అత్తింటి వారు వేధిస్తున్నారని, భూమి కోసం తన తల్లిని కొటి ్ట చంపినంతటి పని చేశారని ఆమె ఆరోపించారు. దీంతో కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. తనకు ప్రస్తుతం ఏ దిక్కూలేదని, కాపురం ముఖ్యమని, తన ను కాపురానికి తీసుకెళ్లి పిల్లలను చూపిస్తే కేసులను ఉపసంహరించుకుంటానన్నారు. తన కాపురాన్ని నిలిపి న్యాయం చేయాలని శ్రీవాణి కన్నీళ్లతో అమర్నాథ్ను అభ్యర్థించారు. అమర్నాథ్ వెంట మాజీ సర్పంచ్ మళ్ల బుల్లిబాబు, ఆర్ఈసీఎస్ డెరైక్టర్ పెంటకోట శ్రీనివాసరావు, జగన్ తదితరులు ఉన్నారు.
మహిళలపై వేధింపులకు శ్రీవాణియే నిదర్శనం
Published Tue, Nov 25 2014 1:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement