ధర్మవరం అర్బన్: చేనేతల బతుకులు పోగుకు వేసే అతుకుల్లా మారుతున్నాయి. ఒక పక్క ఫవర్ లూమ్స్ దెబ్బ, మరో పక్క కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏ మాత్రం పనికిరాని చేతి మగ్గం... భవిష్యత్ ఉంటుందిలే అని చేసిన అప్పులు.. ఇవన్నీ కలసి దంపతుల బలవన్మరణానికి కారణమయ్యాయి. వారి పిల్లలను అనాధలను చేశాయి. వివరాలలోకి వెళితే.. ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నాలుగు మగ్గాలు వేసుకుని భార్యభర్తలు చట్టా రమేష్(35), చట్టా రమాదేవి(34) జీవిస్తుండేవారు.
సంవత్సర కాలం నుండి హ్యాండ్లూమ్ ధర పడిపోవడంతో కూలి మగ్గం వేసేందుకు కూడా ఎవరూ రావడం లేదు. దీంతో దంపతులిద్దరూ కలసి మగ్గాలు వేసినా ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పోవడంతో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో సుమారు నాలుగు లక్షల వరకు బయట అప్పులు చేశారు. కొద్దికాలంగా అప్పుల బాధ మరింత ఎక్కువ కావడంతో... చట్టా రమేష్ ఫిబ్రవరి 1వ తేదీన తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముందు రోజు రాత్రంతా అప్పులు తీర్చలేనని భార్యతో ఆవేదన వ్యక్తం చేసిన రమేష్.. తెల్లవారుజామున రైలు కింద పడేందుకు వెళుతుండగా... గమనించిన భార్య అపే ప్రయత్నం చేస్తుండగానే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క ళ్లెదుటే భర్తను పోగొట్టుకున్న రమాదేవి అప్పటి నుండి తీవ్ర మానసికవేదనకు గురైంది. ఈ క్రమంలో 12వ తేదీన భర్త పెద్ద కర్మ నిర్వహించిన ఆమె.. శుక్రవారం రాత్రి 7 గంటలకు పిల్లల్ని బయటకు పంపించి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తలు ఇద్దరూ చనిపోవడంతో... చిన్నారులు లతీష్, ఇందు అనాధలుగా మారారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దంపతులను మింగిన మగ్గం
Published Sat, Feb 14 2015 2:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement