నాతవరం/దేవరాపల్లి : జిల్లాలోని తాండవ, రైవాడ జలాశయాల నీటిని ఆయకట్టు భూములకు బుధవారం విడుదల చేశారు. రైవాడ నుం చి 250 క్యూసెక్కుల నీటిని మాడుగుల ఎమ్మె ల్యే బూడిముత్యాలనాయుడు విడుదల చేయ గా, తాండవ నుంచి 230 క్యూసెక్కులు డీఈ షణ్ముఖరావు వదిలారు. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ ఎస్ఈ ఎన్.రాంబాబు రైవా డ జలాశయాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలు డీఈఈ ఎ.సునీతను అడిగి తెలుసుకున్నా రు.
అనంతరం రెగ్యులేటింగ్ గేట్లు, జనరేటర్ రూమ్లను పరిశీలించి వాటి సామర్థ్యాన్ని ఇంజినీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. తాండవ రిజర్వాయరు దిగువన ఉన్న వినాయక, శ్రీనల్లగోండమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం మూహర్తం ప్రకారం పూజలు చేసి ప్రధాన గే ట్లు ఎత్తి నీటిని విడుద ల చేశారు. డీఈ మాట్లాడుతూ విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు పరిధి ఆరు మండలాల్లోని 51,640 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు.
కుడికాలువ ద్వారా 50 క్యూసెక్కులు,ఎడమ కాలువు ద్వారా 180 క్యూసెక్కులు తాండవ కాలువులోకి విడుదల చేశామన్నారు. క్రమేపి రెండు కాలువుల ద్వారా 550 క్యూసెక్కులు నీటిని అయకట్టుకు విడుదలకు ఏర్పాట్లు చేశామన్నారు. గతేడాది తుఫాన్లప్పుడు కుడి, ఎడమ కాలువలకు 52 చోట్ల గండ్లు పడ్డాయని, వాటి మరమ్మతులకు రూ.3.5కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. నీరు వృథా కాకుండా సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్యేల్యే వేచలపు శ్రీరామమూర్తి, నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చెర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు, నాతవరం ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేముడు, మండల టీడీపీ అధ్యక్షుడులాలం అచ్చిరాజు, ఎంపీటీసీ సభ్యుడు కాశపు నూకరాజు, జేఈ వేణుగోపాలనాయుడు పాల్గొన్నారు.
రైవాడ నుంచి....
మండలంలోని రైవాడ జలాశయం నుంచి ఆ యకట్టు భూములకు 250 క్యూసెక్కుల నీటిని బుధవారం సాయంత్రం మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు విడుదల చేశారు. ఖరీఫ్ వరినాట్లుకు నీరు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని సాగునీటి సంఘా ల ప్రతినిధులు ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎడమకాలువ ద్వారా 175 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 75 క్యూసెక్కుల నీరు విడుదలకు అధికారులు అంగీకరించారు. దీంతో నీటి పారుదల శాఖ ఎస్ఈ ఎన్.రాంబాబు సమక్షంలో ఎమ్మెల్యే ముత్యాలునాయుడు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్టు భూ ములకు సైతం సాగునీరు అందేలా సాగునీటి సంఘాల ప్రతినిధులు కృషిచేయాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.
జీవీఎంసీ బకాయిలు విడుదల చేయాలి: ఎమ్మెల్యే బూడి
తాగునీటి అవసరాల కోసం రైవాడ నుంచి నీటిని తీసుకుంటున్న జీవీఎంసీ సుమారు రూ.90 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇందుకు ఇరిగేషన్ అధికారులు కృషిచేయాలని ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు ఎస్ఈ ఎన్.రాంబాబును కోరారు. అలాగే జలాశయంలో పూడికతీత, విద్యుత్ పునరుద్ధరణ, పలు అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే ఎస్ఈకి వివరించారు. కార్యక్రమంలో డీఈఈ ఎ.సునీత, ఏఈ అర్జున్, జలాశయం చైర్మన్ బొడ్డు వెంకటరమణ, నీటిసంఘాల అధ్యక్షులు రెడ్డి బలరాం, తాతంనాయుడు, దొగ్గ భూషణం, కర్రి సత్యం, వి.రామునాయుడు, చలుమూరి చంద్రమోమన్, వంటాకు సింహాద్రప్పడు, మతల రాజునాయుడు, వల్లునాయుడు పాల్గొన్నారు.
తాండవ, రైవాడ నీరు విడుదల
Published Thu, Aug 7 2014 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement