-
మాట తప్పని ఆ మహానుభావుడికి సెల్యూట్: ఆర్ నారాయణ మూర్తి
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అదే విధంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'స్వాతంత్యం సిద్ధించి 75 ఏళ్లు దాటినా.. మన కాళ్ల కిందే ఏలేరు నీళ్లు పారుతున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి మనది. ఇలాంటి పరిస్థితుల్లో నేను(ఆర్ నారాయణమూర్తి), దాడిశెట్టి రాజా, ఉమా శంకర్ గణేష్, మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి గతంలో సీఎం జగన్ గారిని తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి విజ్ఞప్తి చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఆ మహానుభావుడు ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాండవ రిజర్వాయర్కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్కు సెల్యూట్' అంటూ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. చదవండి: (చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం: సీఎం జగన్) -
ఆనంద ‘తాండవం’
సాక్షి, అమరావతి: ఏలేరు రిజర్వాయర్ కాలువ, తాండవ జలాశయం కాలువలను అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుసంధానంతో కొత్తగా 5,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు తాండవ జలాశయం కింద 51,465 ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించింది. రూ.470.05 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయంతో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో గొలుగొండ మండలం జీకే గూడెం వద్ద తాండవనదిపై 4.96 టీఎంసీల సామర్థ్యంతో 1965లో జలాశయం నిర్మాణం చేపట్టి 1975 నాటికి పూర్తిచేశారు. తాండవలో నీటి లభ్యత ఆధారంగా ఈ జలాశయం ఒక సీజన్లో ఒకటిన్నరసార్లు నిండుతుందని అంచనా వేసిన జలవనరులశాఖ.. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 51,465 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ(ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు) వ్యవస్థను ఏర్పాటు చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల నదిలో నీటి లభ్యత తగ్గడంతో ఈ జలాశయం కింద ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. తాండవ జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపి.. ఆయకట్టును స్థిరీకరించి తమను ఆదుకోవాలన్న ఆ ప్రాంత రైతుల విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. తాండవ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ఏలేరు కాలువ పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఆయకట్టుకు నీళ్లందించాలని జలవనరులశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి జలాలతో సస్యశ్యామలం ఏలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 24.1 టీఎంసీలు. ఏలేరు పరీవాహక ప్రాంతంలో 17.92 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన అధికారులు ఎడమ కాలువ కింద 1.14 లక్షల ఎకరాలు, కుడి కాలువ కింద పదివేల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టును రూపొందించారు. పోలవరం ఎడమ కాలువ నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటికే ఏలేరు రిజర్వాయర్కు గోదావరి జలాలు తరలిస్తుండటం వల్ల నీటి లభ్యత సమస్య ఉండదు. ఏలేరు ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందిస్తూనే.. తాండవ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించి సస్యశ్యామలం చేయవచ్చన్న జలవనరులశాఖ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. ఏలేరు, తాండవ ఆయకట్టుకు భరోసా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు విశాఖ నగర పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు ఏలేరు ఎడమ కాలువ ద్వారా రోజుకు 175 క్యూసెక్కుల చొప్పున నీరు సరఫరా చేయాలని ఏలేరు ప్రాజెక్టు నివేదికలోనే స్పష్టంగా పేర్కొన్నారు. ఏలేరు ప్రాజెక్టు పూర్తయినా ఇప్పటికీ పూర్తి ఆయకట్టుకు నీళ్లందించిన దాఖలాల్లేవు. దీనికి ప్రధాన కారణం ఎడమ కాలువ పనుల్లో లోపాలే. ఏలేరు రిజర్వాయర్ వద్ద ఎడమ కాలువ ప్రవాహ సామర్థ్యం వెయ్యి క్యూసెక్కులు, చివరకు వచ్చేసరికి 220 క్యూసెక్కులు ఉండేలా పనులు చేపట్టారు. కానీ.. కాలువను ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల 450 క్యూసెక్కులకు మించి సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎడమ కాలువను వెడల్పు చేయడం, లైనింగ్ చేయడం ద్వారా 1,250 క్యూసెక్కులకు పెంచవచ్చని, తద్వారా ఎడమ కాలువ కింద పూర్తి ఆయకట్టుకు నీళ్లందిస్తూనే కొత్తగా 5,600 ఎకరాలకు నీళ్లందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏలేరు ఎడమ కాలువ నుంచి రోజుకు 250 క్యూసెక్కుల చొప్పున తాండవ కాలువలోకి ఎత్తిపోసి, ఆ ప్రాజెక్టు కింద 51,465 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి చర్యలు చేపట్టింది. బాబు నిర్లక్ష్యం.. జగన్తో సాకారం సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: చంద్రబాబు హయాంలో తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో నిర్లక్ష్యానికి గురైన రైతులను ఆదుకునేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి రూ.470 కోట్లు మంజూరు చేసి చరిత్ర సృష్టించారని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చెప్పారు. ఆయన శుక్రవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. ఏలేరు–తాండవ లింక్ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలోని తుని, ప్రత్తిపాడు, విశాఖ జిల్లా పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం తదితర నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా, పీఏసీ చైర్మన్గా పనిచేసిన యనమల రామకృష్ణుడు 40 ఏళ్ల రాజకీయాల్లో రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్లకు మించి సాధించలేకపోయారని విమర్శించారు. -
ఇసుక దందా.. కనిపించదా!
• తాండవ గర్భంలో జేసీబీలతో తవ్వకాలు • విలువ రూ.6 కోట్లకు పైమాటే • జలాశయానికి పొంచి ఉన్న ముప్పు • పట్టించుకోని అధికారులు గొలుగొండ(నర్సీపట్నం): తాండవ జలాశయం జిల్లాలో పెద్దది..ఈ జలాశయం ద్వారా రెండు జిల్లాలకు సుమారుగా 55 వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. అలాంటి జలాశయానికి ప్రస్తుతం ప్రమాదం పొంచి ఉంది. గతంలో నీలం తుపాను వల్ల బొడ్డేరు గెడ్డ ప్రవాహా నికి జలాశయానికి కిలోమీటరు దూరంలో సుమారు 50 ఎకరాలకు పైగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. ఇసుక మేటలు తరలించేం దుకు గతంలో అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇది ఇసుక అక్రమ వ్యాపారులకు కలిసొచ్చింది. యథేచ్ఛగా ఇసుకను తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ ఆదా యానికి కోట్లాది రూపాయల గండి పడుతోం ది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. గత ఏడాది అంచనా నీలం తుపాను సందర్భంగా జలాశయాం గర్భంలోకి చేరిన ఇసుక మేటలు తొలగించేందుకు అధికారులు అంచనా వేశారు. కాంట్రాక్టర్లు గాదపాలెం నుంచి నర్సీపట్నం, విశాఖపట్నం తరలించేందుకు ప్రయత్నించారు. కానీ వేలం నిర్వహించే సమయంలో ఏకధాటిగా వర్షాలు కురిసాయి. ఫలితంగా వేలంపాట నిలిచిపోయింది. దీంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఇసుక తరలింపుపై స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది ఇసుక తరలింపు నిలిచిపోయింది. యథేచ్ఛగా తరలింపు గతంలో నిలిచిన టెండర్ల ప్రక్రియ అక్రమార్కులకు వరంగా మారింది. దీన్ని అదునుగా చేసుకున్నారు. ప్రస్తుతం జలాశయం గర్భంలో నీరు లేకపోవడంతో ఇసుక తరలింపు జోరుగా సాగుతోంది. చోద్యం, గాదంపాలెం, ఎ.ఎల్.పురం, కేడిపేట, జోగుంపేట, నర్సీపట్నం, కొత్తమల్లంపేట, చిన్నయ్యపాలెంకు చెందిన వందలాది ట్రాక్టర్లతో రోజూ ఇసుకను తరలిస్తున్నారు. కూలీల ద్వారా అయితే పనులు ఆలస్యంగా జరుగుతాయనే ఉద్దేశంతో జేసీబీతో నాలుగురోజులుగా పగలు, రాత్రిళ్లు ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. ఇంత జరగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. కొరవడిన పర్యవేక్షణ జలాశయం గర్భం నుంచి రోజూ వందలాది ట్రాక్టర్ల నుంచి ఇసుక తరలిస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్క ఇసుక ట్రాక్టర్ను కూడా అధికారులు పట్టుకున్న దాఖలాలు లేవంటున్నారు. ఇసుక అక్రమ తరలింపు చేస్తున్న వ్యాపారులతో అధికారులకు కుమ్మక్కై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాండవ జలాశయానికి ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తరలింపు అడ్డుకోవడంలో అధికారులు విఫలం చెందారని వైఎస్సార్సీసీకి చెందని చోద్యం ఎంపీటీసీ సభ్యుడు నాతిరెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్కు ఫిర్యాదులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇసుక తరలింపు సమయంలో గాదంపాలెంకు చెందని ఓ వ్యక్తి ట్రాక్టర్ నుంచి వంద రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నాడని, ఇలా రోజుకు రూ.50వేల వరకు ఆదాయం పొందుతు న్నాడని స్థానికులు చెబుతున్నారు. జలాశయానికి ముప్పే ఇసుక నిల్వలు లేకపోతే వరదలు వస్తే బొడ్డేరు గెడ్డ నీటి ఉధృతికి కిలోమీటరు దూరంలో ఉన్న తాండవ జలాశయానికి ప్రమాదం పొంచి ఉందని మేధావులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేలాది ఎకరాలకు సాగునీరందించే జలాశయానికి ఊహించని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మేటలు ఉండడంతో నీటి ఉధృతిని అడ్డుకుంటాయని, ఫలితంగా రిజర్వాయర్కు నష్టం జరగదంటున్నారు. దీంతో పాటు ఇసుక తవ్వకాల వల్ల సమీప గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతాయని చెబుతున్నారు. -
అన్నదాత.. విజేత
ఆగిన నీటి తరలింపు నిర్ణయం రైతులు, వైఎస్సార్ సీపీ ఉద్యమ ఫలితం ఇది తాండవ రైతుల విజయం.. వైఎస్సార్ సీపీ నేత ఉమాశంకర్ గణేశ్ రిలే దీక్షల నిర్ణయం విరమణ నాతవరం: తాండవ రిజర్వాయర్ నీటిని విశాఖ స్టీల్ప్లాంట్కు తరలించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈ మేరకు తాండవ నీటిని ఏలేరు కాలువలోకి తరలించడానికి లక్ష్మీపురం వద్ద తీసిన కాలువలను అధికారులు తిరిగి కప్పేశారు. కాలువలు కప్పేసిన ప్రాంతాన్ని ైవైఎస్సార్సీపీ నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేశ్, రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు అంకంరెడ్డి జెమీలు, రైతులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ, నీటి తరలింపుకోసం తీసిన కాలువలు తిరిగి కప్పేశారంటే ప్రభుత్వం నీటి తరలింపును విరమించుకున్నట్టేనని.. ఇది తాండవ రైతుల విజయమని చెప్పారు. ఈ సందర్భంగా చుట్టు పక్కల గ్రామాల రైతులు వైఎస్సార్సీపీ నాయకుల వద్దకు వచ్చి కృతజ‘తలు తెలిపారు. మొదట్లో అధికారుల హడావుడి చూసి ప్రభుత్వం తాండవ నీటిని విశాఖకు తరలించుకుపోతుందని ఆందోళన చెందామన్నారు. కేవలం వైఎస్సార్సీపీ రైతులు పక్షాన నిలిచిపోరాటం చేయడం వల్లే నీటి తరలింపును విరమించుకున్నారన్నారు. అనంతరం గణేశ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. తాండవ నీటిని విశాఖకు తరలిస్తామని రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు ఈనెల 12న విశాఖలో ప్రకటన చేసిన మరునాడే ఈ ప్రాంతాన్ని పరీశీలించి ఒక చుక్క తాండవ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించినా అడ్డుకుంటామని హెచ్చరించామని గుర్తుచేశారు. త ర్వాత రైతులతో కలిసి ఈనెల 13 నుంచి వివిధ రకాల ఆందోళనలు చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చామన్నారు. తాండవ నీరు రానున్న కాలంలో రైతుల సాగుకు తప్ప ఏ ఇతర అవసరాలకు తరలించాలన్న ఆలోచన ప్రభుత్వం చేయరాదని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల కంటే స్వప్రయోజనాలు కోసం అధిక ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. జెమీలు మాట్లాడుతూ మంత్రి అయ్యన్నపాత్రుడికి తెలిసే తాండవ నీటి తరలింపు ఆలోచన జరిగిందన్నారు. ఆయన ఆదేశాల మేరమే ఇక్కడి అధికారులు కాలువ పనులు చేపట్టారని, ఇలాంటి నీచ రాజకీయాలు మంచిదికాదని సూచించారు. రిలే నిరాహార దీక్షలు విర మణ తాండవ నీటి తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 23 నుంచి ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులతో కలిసి చేయ తలపెట్టిన రిలే నిరాహారదీక్షను విరమించుకుంటున్నట్టు గణేశ్ తెలిపారు. ఇక్కడ తీసిన కాలువలు మూసేయడంతో తాండవ నీటి తరలింపును ప్రభుత్వం విరమించుకున్నట్టేనన్నారు. వైఎస్సార్సీపీ 10 రోజులుగా చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలిచిన రైతులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు పైల సునీల్, చిటికిల వెంకటరమణ, శెట్టి నూకరాజు, పైత పోతురాజు, నర్సీపట్నం మండల రూరల్ పార్టీ అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ, మాకవరపాలెం మండల పార్టీ అధ్యక్షుడు రుత్తల సత్యనారాయణ, సర్పంచ్ లాలం లోవ తదితరులు పాల్గొన్నారు. తరలింపు ఆగినట్టే.. డీఈ ఈ విషయంపై తాండవ జలాశయం డీఈ చిన్నంనాయుడును ‘సాక్షి’ విలేకరి వివరణ కోరగా నీటి తరలింపు ఆగినట్టేనని స్పష్టంచేశారు. రైతుల ఆందోళన, నీరు ఇవ్వరాదని తాండవ జలాశయం కమిటీ సభ్యుల తీర్మానం నివేదికను జిల్లా కలెక్టర్, ఇరిగే షన్ ఎస్ఈకి నివేదించామన్నారు. తాండవ నీరు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలులేదంటా రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు కూడా స్వయంగా చెప్పారని తె లిపారు. కాగా, తాండవ నీటి తరలింపును వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి వైఎస్సార్సీపీ ఆందోళన తీవ్రతరం చేయడం, నిరశన దీక్షలకు పూనుకోవడంతో ప్రభుత్వం దిగివచ్చిందని తెలిసింది. -
ఇ(సు)క ‘ఫ్రీ’గా దోపిడీ
ఇసుకతో పచ్చనేతలకు కాసుల పంటే ఉచితం పేరిట‘దేశం’ నేతల దందా దళారులకు మేలు..పేదలకు మోత.. రవాణా, లోడింగ్, అన్లోడింగ్ పేరుతో లూటీ నిన్నటి వరకు డ్వాక్రా మాటున దోపిడీ... ఇక ఉచితం పేరుతో లూటీ.. నిత్యావసర చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన ఇసుకను నిరుపేదలు..ప్రభుత్వావసరాలకు ఉచితంగా ఇవ్వ నున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అడుగడుగునా ఆంక్షలు ఉన్నప్పుడే అడ్డగోలుగా నదులు..వాగులు..వంకల్లోని ఇసుకను దోచుకుతిన్నారు. ఇప్పుడు ఆయుధంలా మారిన ‘ఉచితం’ను అడ్డంపెట్టుకుని పేదల మాటున నదీ గర్భాలను సైతం అడ్డూ..అదుపు లేకుండా తూట్లు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం: జిల్లాలో ఇసుక విషయమై మైనింగ్శాఖ జనవరిలో ప్రత్యేకంగా సర్వే చేపట్టింది. నారాయణరాజుపేట రీచ్లో 10 వేలు, కాశీపట్నం రీచ్లో 15వేలు, కైలాసపట్నం రీచ్లో 14వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్టు నిర్ధారించింది. తాండవ రిజర్వాయర్లో పూడిక తీత ద్వారా వెలికి తీసే ఇసుక 62,470 క్యూబిక్మీటర్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇలా మొత్తంమ్మీద జిల్లాలో ప్రస్తుత సీజన్లో రూ.లక్ష క్యూబిక్ మీటర్లు ఇసుక అందుబాటులోఉంది. గతంలో ఇలాగే నోటిఫై చేసిన 25 రీచ్ల్లో 3.5లక్షల క్యూ.మీ.ఇసుక ఉన్నట్టు లెక్క తేలిస్తే ఏకంగా ఐదున్నర లక్షల క్యూ.మీ.లకు పైగా ఇసుకను తవ్వేశారు. ఇంకా తవ్వుతూనే ఉన్నారు. తాజాగా లక్ష క్యూ.మీ. ఇసుక అందుబాటులో ఉందంటే ఇక ఏ స్థాయిలో తవ్వకాలు జరుపుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా జిల్లాలో గోస్తని, వరహా, శారదా నదుల రూపురేఖలే మారిపోయాయి. ఇక వాగులు..వంకలైతే ఇసుకతవ్వకాల వల్ల దిశ మారిపోయి వంకరటింకరగా ప్రవిహ స్తున్నాయి. దళారీలను ఆశ్రయించాల్సిందే.. సాధారణంగా వ్యక్తిగత అవసరాల కోసం పేదలు, ప్రభుత్వాసవసరాలకు కాంట్రాక్టర్లు, అధికారులు నేరుగా ఇసుక తవ్వే అవకాశం ఉండదు. వీరంతా ఎప్పటిలాగే వ్యాపారులపైనే ఆధారపడాలి. ప్రస్తుతం క్యూబిక్ మీటర్ రూ.550 కాగా రవాణా, లోడింగ్ అన్లోడింగ్ కలిపి యూనిట్ (3 క్యూ.మీ.) ఇసుకను ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.1700లు చెల్లించాల్సి ఉంది. ఇసుక కొరతను ఆసరాగా చేసుకుని యూనిట్ ఇసుకను రూ.2,500నుంచిరూ.3వేల వరకువిక్రయిస్తున్నారు. కొత్త విధానంలో ఇసుక ఫ్రీగా ఇస్తున్నప్పటికీ లోడింగ్, అన్లోడింగ్, రవాణా చార్జీలను భరించాల్సిందే. ప్రస్తుతం జిల్లాలో నిర్మాణానికి అనువైన ఇసుక లేకపోవడంతో శ్రీకాకుళం, గోదావరి జిల్లాల నుంచి దిగుమతి అవుతున్న ఇసుకపైనే ఆధారపడుతున్నారు. ఒక వేళ నిజంగా రీచ్ల వద్ద ఎలాంటి రుసుం వసూలు చేయక పోయినప్పటికీ జిల్లాలోని ఇసుకనే ఇతర జిల్లాల నుంచి తీసుకొస్తున్నట్టుగా చెబుతూ లోడింగ్, అన్లోడింగ్, దూరాభారాన్ని బట్టి రవాణా చార్జీలు కలిపి భారీగానే వసూలు చేసే అవకాశాలున్నాయి. ఇసుక పంపిణీ బాధ్యత కూడా జన్మభూమి కమిటీలకు అప్పగించనుండ డంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. వీరిని అడ్డంపెట్టుకుని స్థానిక టీడీపీ ప్రజాప్రతి నిధులు అడ్డంగా దోచుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒక వైపు ఇసుక మాఫియా.. మరో వైపు టీడీపీ నేతలు పేదల పేరిట అడ్డగోలుగా తవ్వకాలు సాగించి దర్జాగా సొమ్ముచేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాటి రూపురేఖలు మారిపోతాయి ఇప్పటికే చాలా వరకు వాగులు..వంకలు ఎండిపోతున్నాయి. మరోనెలరోజుల్లో జిల్లా లోని నదుల్లో కూడా నీటి ప్రవాహం పూర్తిగా అడుగంటి పోతుంది. దీంతో బయట కొచ్చే ఇసుకను ఇష్టమొచ్చినట్టుగా తవ్వే అవకాశం ఉంది. జిల్లాలో నదులన్నీ థర్డ్ ఆర్డర్ పరిధిలోనివే. వాటిలో ఇసుకతవ్వకాల కోసం స్థానిక పంచాయతీల నుంచి అనుమతులు తీసుకుంటే చాలు. పూడిక తీత ద్వారా వెలికి తీసే ఇసుక తవ్వకాలతో తాండవ రిజర్వాయర్కు ముప్పువాటిల్లే అవకాశాలు లేకపోలేదు. ఇక నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థలకు సీనరేజ్లో వాటాలు దక్కేవి. ప్రస్తుతం సీనరేజ్ వసూళ్లను పూర్తిగా నిలిపివేస్తే ఆ మేరకు వాటి ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. ఉచితంపై నిఘా ఉంటుంది ఇసుకను నిత్యావసరాల చట్టం పరిధిలోకి తీసుకొచ్చి పేదలు, ప్రభుత్వావసరాలకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు రాలేదు. ఎంత ఉచితంగా ఇచ్చినా..తవ్వకాలు..అమ్మకాలపై ఆయా శాఖల నిఘా ఉంటుంది. -సూర్యచంద్రరావు, ఏడీ, మైన్స్,
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement