గ్రామాల అభివృద్ధికి సూక్ష్మ ప్రణాళిక ఆవిష్కరణ
ఇప్పటికే సమగ్ర సర్వే పూర్తి
ఎంపీ కేశినేని శ్రీనివాస్ కృషి
విజయవాడ : టాటా ట్రస్టు అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎంపీ కేశినేని కోరారు. దీనికి రతన్ టాటా అంగీకరించడంతో టాటా ట్రస్టు తరఫున ప్రతినిధులు ఇక్కడికొచ్చి 1400 మంది యువకులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇప్పించి నియోజకవర్గంలో జనాభా గురించి సమగ్రంగా సర్వే చేయించారు. నియోజకవర్గంలోని గ్రామా ల అభివృద్ధి కోసం నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతులకు వెదురు సాగు వంటి లాభదాయక పంటలు పండించటంపై శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడానికి టాటా ట్రస్టు కృషి చేయనుంది. దీనికి సంబంధించి తయారు చేసిన సూక్ష్మ ప్రణాళికను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, రతన్ టాటాలు ఆవిష్కరిస్తారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో నియోజకవర్గ అభివృద్ధిపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. కేంద్రం, రాష్ట్రంతో పాటు టాటా ట్రస్టు నుంచి వచ్చే నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తారు.
టాటా పర్యటన సాగేదిలా...
రతన్ టాటా ఉదయం 10 గంటలకు ముంబయి నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. ఆయనకు టాటా ట్రస్టు ప్రతినిధులు అద్దేపల్లి శ్రీనివాస్, ఆర్.వెంకట్, ఎస్.దూబే, ఎంపీ కేశినేని శ్రీనివాస్లు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 11.30 నుంచి 1.30 వరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.45 నుంచి 3 గంటల వరకు సుమారు 25 మంది పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రితో కలిసి హోటల్ గేట్వేలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రితో కలిసి విలేకరుల సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 5.35 గంటల వరకు రామవరప్పాడులోని 24 కే హోటల్లో జరిగే స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమంలో పాల్గొని సీఎంతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై అవగాహన పత్రంపై సంతకం చేస్తారు. సాయంత్రం ఆరు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళతారు. 24 కే కన్వెన్షన్ సెంటర్లో జరిగే పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు సమావేశంలో సాయంత్రం 5.10 నుంచి 5.20 వరకు రతన్టాటా, 5.20 నుంచి 5.35 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. ట
బెజవాడపై టాటా చూపు!
Published Mon, Aug 24 2015 1:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement