అనంతపురంలోని 34వ డివిజన్కు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన నాయక్నగర్ నివాసి ఉష ఇంటిపై తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం దౌర్జన్యం చేశారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరించారు. బాధితురాలి కథనం మేరకు... గురువారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో టీడీపీ నాయకులు, కార్పొరేటర్ నరసింహులు, నాగరాజులు ఉష ఇంట్లోకి చొరబడ్డారు. లోపల ఉన్న ఆమె చిన్న కుమారుడు అభిషేక్ను చితకబాదారు. ‘ఏయ్ నీ పెద్ద కొడుకు జ్ఞానిగాడు ఎక్కడున్నాడే... వాడ్ని రమ్మని చెప్పు’ అంటూ కత్తి చూపి ఉషను బెదిరించారు.
‘ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చోవద్దని చెప్పినా నీ కొడుకు జ్ఞానేశ్వర్ వైఎస్సార్ సీపీ తర ఫున పనిచేశాడు. రేపటిలోపు ఇళ్లు ఖాళీ చేయండి. లేకపోతే ప్రాణాలు తీస్తాం’ అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఇంతలోనే ఉష బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. జనాలను చూసిన టీడీపీ నాయకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. బాధితురాలు ఉష టూటౌన్ ఎస్ఐ సుబ్బరాయుడు ఫోన్ చేసి ‘సార్ ఇలా మా ఇంటిపైకి దాడికి వచ్చారు. మీరు రండి’ అంటూ వేడుకున్నారు. అయితే స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయమ్మా అంటూ ఎస్ఐ సూచించారు.
నాయక్నగర్లో అక్కడక్కడ వాళ్ల వాళ్లున్నారు మీరేరండి అని వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు అదే స్టేషన్కు చెందిన ఎస్ఐ రవిశంకర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గుమిగూడిన జ నాన్ని చెదరగొట్టారు. ఎవరూ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో వివరాలను సేకరించారు. ఎవరిపైనైనా ఫిర్యాదు చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్ రావాలన్నారు. ఇంటి వద్ద ఇద్దరు పోలీసులను ఉంచి ఎవరైనా ఆ ప్రాంతం కాని వారు వస్తే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.
చంపేస్తానంటూ టీడీపీ కార్పొరేటర్ వీరంగం
Published Fri, May 23 2014 9:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement