వైఎస్ఆర్ జిల్లా, కాశినాయన : జిల్లాలోని చిన్నాయపల్లెలో టీడీపీ నాయకులు శుక్రవారం నాటు బాంబులు వేసుకున్నారు. ఒక వర్గానికి చెందిన రమణారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. కాగా మరో వర్గానికి చిన్నపరెడ్డికి స్పల్ప గాయాలయ్యాయి.
స్థానికులు, పోలీసులవివరాల మేరకు ..
గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చిన్నపరెడ్డికి గోకులం పథకం మంజూరైంది. అయితే స్థలం కోసం శుక్రవారం హద్దులు చూసుకుంటుండగా మరో వర్గానికి చెందిన రమణారెడ్డి వచ్చి గోకులం ఏర్పాటు చేస్తే శ్మశానానికి వెళ్లే దారికి అడ్డుమవుతుందని వారించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈనేపథ్యంలో చిన్నపరెడ్డి వర్గీయులు నాటుబాంబులతో రమణారెడ్డిపై విరుచుకపడ్డారు. ప్రమాదంలో రమణారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. కాగా అదే సమయంలో చిన్పపరెడ్డికి కూడా స్వల్పగాయాలు అయ్యాయి. పోరుమామిళ్ల ఇన్చార్జి సీఐ రమేష్బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణ నిర్వహించి ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.