ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 19 నుంచి 26 వరకు నామినేషన్లు
మార్చి 16న పోలింగ్, 19న కౌంటింగ్
ధన ప్రవాహానికి పక్కా ప్రణాళికలు
ఏలూరు సిటీ : రాజకీయ చైతన్యానికి ఉభయ గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడి ఎన్నికకు నగారా మోగటంతో రేసులో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఈనెల 19నుంచి 26తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 27న నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు మార్చి 2వరకు గడు వు విధించారు. మార్చి 16న పోలింగ్, 19న కౌంటింగ్ చేపడతారు. మాజీ ఎమ్మెల్సీ కలిదిండి చైతన్యరాజు, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ పరుచూరి కృష్ణారావు, పీడీఎఫ్ మద్దతుతో బరి లోకి దిగిన సామాజికవేత్త రాము సూర్యారావు, స్వతంత్ర అభ్యర్థులుగా పిల్లి డేవిడ్కుమార్, విశ్రాంత పీడీ సత్యనారాయణ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలోనూ రూటే సెప‘రేటు’ అన్నట్టుగా అభ్యర్థులు ధన ప్రవాహాన్ని పోటెత్తించేందుకు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇద్దరు అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.10 కోట్ల చొప్పున వెచ్చిం చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో భారీగా నజరానాలు వెదజల్లగా, ఈ సారి అంతకంటే ఎక్కువగా సొమ్ములు, బహుమతులు పంపిణీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాయిలాల పంపిణీ బాధ్యతలను కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు అప్పగించిన నాయకులు, ఇతర సంఘాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు గాలం వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో 9,250మంది ఓటర్లు ఉండగా, తూర్పుగోదావరి జిల్లాలో 12,654 మంది ఉన్నారు. వీరిలో అగ్రస్థానం ఉపాధ్యాయులదే. ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఓటర్లు సుమారు 13వేల నుంచి 14వేల మంది ఉంటారని అంచనా. అధ్యాపకులు, ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఓటర్లు 7వేల మంది ఉన్నట్టు తెలుస్తోంది.
మండలి వే‘ఢీ’
Published Mon, Feb 16 2015 11:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement