విలీనం కాకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితే! | Sakshi
Sakshi News home page

విలీనం కాకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితే!

Published Thu, Feb 27 2014 4:51 PM

జైరాం రమేష్ - Sakshi

హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనంకాకుంటే ఆమ్‌ ఆద్మీ పార్టీగా మారుతుందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. తెలంగాణ రాజకీయ జెఏసి నేతలు ఈరోజు ఇక్కడ జైరాం రమేష్ను కలిశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వారు టిఆర్ఎస్ విలీనం- సామాజిక తెలంగాణ అంశాలపై చర్చించారు.

ఉద్యమంలో తాము అనేక అవమానాలు భరించామని జేఏసీ నేతలు రమేష్కు చెప్పారు. తెలంగాణలో దొరల పాలనను తాము అంగీకరించం అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తామని చెప్పారు. పలు అంశాలపై జైరాం రమేష్‌కు వారు ఒక నివేదిక సమర్పించారు.

Advertisement
Advertisement