నెల్లూరు(టౌన్), న్యూస్లైన్: ప్రభుత్వం పదోతరగతి పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేసింది. నెల్లూరు జిల్లా 88.05 శాతం విజయాన్ని సొంతం చేసుకుని రాష్ట్రంలో 16 స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాలు తూర్పుగోదావరి, కడప జిల్లాలు దక్కించుకున్నాయి. ఫలితాల్లో గత ఏడాది రాష్ట్ర స్థాయిలో 15వ స్థానాన్ని దక్కించుకున్న జిల్లా ఒక మెట్టు దిగి 16వ స్థానాన్ని పొందింది. గత సంవత్సర ఫలితాలతో పోల్చితే 87.35 శాతం నుంచి 88.05 శాతానికి ఎగబాకింది.
అంటే జిల్లాలో 0.70 శాతం అదనంగా ఫలితాలు పొందింది. ఈ సంవత్సరం సమైక్య బంద్లు, విద్యార్థి సంఘాల నిరంతర ఆందోళనల మధ్య చదువు సరిగా కొనసాగలేదు. ఫలితాలు ఎలా వస్తాయోనని విద్యార్థులు, త ల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వెలువడిన ఫలితాలు మెరుగ్గానే వచ్చాయి. జిల్లా మొత్తం మీద 30,808 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో బాలురు 15,856 మంది రాశారు.
13,884 మంది ఉత్తీర్ణత పొంది 87.56 శాతం విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాలికలు 14,952 మంది పరీక్షలు రాసి 13,243 మంది ఉత్తీర్ణ పొంది 88.57 శాతం విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇద్దరి ఫలితాలు కలిపితే జిల్లా సరాసరి ఉత్తీర్ణత శాతం 88.05గా నమోదైంది. బాలుర కంటే బాలికలు 1.1 శాతం అదనంగా విజయాన్ని సొంతం చేసుకుని ఎప్పటిలాగే ఉత్తీర్ణత శాతంలో బాలికలు తమ హవా కొనసాగించారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 88 మంది పదికి పది పాయింట్లు సాధించి ఏ-1 గ్రేడు స్థానాన్ని నిలుపుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సైతం
ఏ-1 గ్రేడులు:
రాత్రి వరకు ఆన్లైన్లో పరిశీలించిన సమాచారం మేరకు జిల్లాలోని ఉదయగిరి మండలంలోని అప్పసముద్రం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం.అనూష, కావలి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కె.జగదీశ్వరి, చేజర్లలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏ.శ్రీహర్ష పదికి పది పాయింట్లు సాధించి గ్రేడు-1 స్థానాన్ని దక్కించుకున్నారు. మరి కొంతమంది విద్యార్థులు కూడా ఇదే గ్రేడు పొంది ఉండవచ్చని వివరాలు తెలియాల్సి ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇవి కాక జిల్లాలో ఏ-2, బి-1, బి-2 ఫలితాలు అనేక మంది పొందారు.
ప్రైవేటు పాఠశాలల హవా:
ఏ-1 గ్రేడు సాధనలో ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు తమ హవాను కొనసాగించాయి. వేణు డెరైక్టర్గా ఉన్న రత్నం పాఠశాల 11, నారాయణ, డాక్టర్ కిశోర్ రత్నం, రవీంద్రభారతి, శ్రీచైతన్య, హిమాలయ, రాఘవ, లిల్లీలిటిల్ ఫ్లవర్, లిటిల్ఏంజిల్స్ తదితర పలు ప్రైవేటు పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాయి.
కార్పొరే షన్
పాఠశాలల హవా
నెల్లూరు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు తమ హవాను కొనసాగించాయి. 15 పాఠశాలలకు చెందిన 982 మంది పరీక్షలు రాయగా 717 మంది ఉత్తీర్ణత పొంది 73 శాతం విజయాన్ని అందుకున్నారు. నగరంలోని రంగనాయకుల పేటలోని పీఎన్ఎం ఉన్నత పాఠశాల విద్యార్థులు 93 శాతం విజయాన్ని అందుకుని కార్పొరేషన్ పాఠశాలల్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. గాంధీనగర్లోని మున్సిపల్ పాఠశాల 90 శాతం, మూలాపేటలోని రామయ్యబడి మున్సిపల్ పాఠశాల 83 శాతం ఫలితాలతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి.
బీవీనగర్లోని కేఎన్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి జ్ఙానేశ్వర్ 9.8 గ్రేడును సాధించి నగరపాలక పాఠశాలల్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదే పాఠశాలకు చెందిన జాస్మిన్ 9.7, పీఎంఆర్ మున్సిపల్ పాఠశాలకు చెందిన స్వప్నా పీటర్ 9.7, వైవీఎం పాఠశాలకు చెందిన కె.బాలాజీ 9.7 గ్రేడు పొంది ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు. కార్పొరేషన్ పాఠశాలల్లో ఉన్నత పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను యూటీఎఫ్ నాయకులు సుబ్బారావు, మధు ఒక ప్రకటనలో అభినందించారు.
పది పరీక్షల్లో 88.05 శాతం ఉత్తీర్ణత
Published Fri, May 16 2014 2:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement