మంత్రి రావెల చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ప్రారంభం
గుంటూరు మెడికల్: పేదలకు కార్పోరేట్స్థాయి వైద్యసేవలు అందించటమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రావెల కిషోర్బాబు అన్నారు. బుధవారం గుంటూరు కేవీపీకాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రొటావైరస్ వ్యాక్సిన్, ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్, చంద్రన్న సంచార చికిత్స వాహనాలను (పాత 104 వాహనం) ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ‘చంద్రన్న సంచార చికిత్స వాహనాలు’ అందుబాటులోకి తెచ్చారని చెప్పారు.
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ వాహనాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చటమే చంద్రబాబు లక్ష్యమని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ పిల్లల్లో నీళ్ళ విరోచనాలను రొటావైరస్ వ్యాక్సిన్ అరికడుతుందని, డయేరియా రాకుండా పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలన్నారు.
ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ చంద్రన్న సంచార వాహన సేవలను ప్రైవేటు సంస్థకు అప్పగించినా వాటిపై ప్రభుత్వం అజమాయిషీ, విజిలెన్స్ మానిటరింగ్ ఉండాలని తెలిపారు. వినుకొండ, మాచర్ల, రేపల్లె ఆస్పత్రుల్లో గుండెపోటు బాధితుల కోసం సీసీయూ, ఐసీయూలు ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ రామకృష్ణ , జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, జాయింట్ కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వర రావు, డీఎంహెచ్వో డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి, డీఐవో డాక్టర్ మాచర్ల సుహాసిని, డీటీసీవో డాక్టర్ యేపూరు కామేశ్వరప్రసాద్, పీవో డీటీటీ డాక్టర్ వై. రామకోటిరెడ్డి, ఎన్హెచ్ఎమ్ డీపీఎంవో డాక్టర్ మేడా శ్యామలాదేవి, టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాసరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం
Published Thu, Apr 21 2016 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement