-
పోలియో చుక్కలు వేయించిన కొద్దిసేపటికే
సాక్షి, దుండిగల్: పోలియో చుక్కలు వేయించిన కొద్ది నిమిషాలకే 3 నెలల పసిపాప విగత జీవిగా మారింది. ఈ ఘటన దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్లో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, రమ్యలకు దీక్షిత (3 నెలల) పాప ఉంది. మహేశ్వరంలో తల్లిగారి ఇంటికి వెళ్లిన రమ్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిన్నారికి శంభీపూర్లోని అంగన్వాడీ కేంద్రంలో పోలియో చుక్కలు వేయించింది. ఇంటికి వెళ్లిన 15 నిమిషాలకే చిన్నారి నుంచి ఎలాంటి ఉలుకూపలుకూ లేదు. చిన్నారిలో చలనం లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు మదీనాగూడలోని చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: అన్యాయం జరుగుతుంటే గాడిదలు కాస్తున్నారా? వ్యాక్సిన్ వికటించడంతోనే పాప మృతి చెందిందని పేర్కొంటూ చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్, దండిగల్ మండల వైద్యాధికారి నిర్మల, సీఐ వెంకటేశం, ఎస్ఐ చంద్రశేఖర్ అంగన్వాడీ కేంద్రం వద్దకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. ఇదే బూత్లో 250 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని, వారందరూ క్షేమంగానే ఉన్నారన్నారు. పుట్టిన సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యలుంటేనే ఇలా జరిగే ఆస్కారముందని, పోస్ట్మార్టమ్ నివేదికలోనే నిజానిజాలు బయటకు వస్తాయని, అప్పటి వరకు ఏ విషయం చెప్పలేమన్నారు. -
బీసీజీ, పోలియో టీకాలతో కరోనాకు చెక్!
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో క్షయ, పోలియో వ్యాక్సిన్లను ఉపయోగించే అవకాశాన్ని అమెరికా పరిశోధకులు పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్ను కట్టడి చేయడంతో ట్యుబర్కులోసిస్ టీకా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు అమెరికాలో పరీక్షలు జరుగుతున్నాయని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. ‘కోవిడ్–19పై పోరాడేందుకు ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ఏకైక టీకా బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్టే గ్యురిన్)నే’అని టెక్సాస్ ఏ అండ్ ఎం హెల్త్ సైన్స్ సెంటర్కు చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ డి సిరిల్లో అన్నారు. (గూగుల్ @కరోనా సెంటర్) అమెరికా ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గతంలో ఈ టీకాను సురక్షితంగా ప్రయోగించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. కోవిడ్–19 నిలువరించేందుకు పోలియో వ్యాక్సిన్ను కూడా వాడొచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. పాక్ సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెసర్ అజ్రా రజా మాట్లాడుతూ.. బీసీజీ టీకా అనేక రకాల వైరస్లతోపాటు బ్లాడర్ క్యాన్సర్ను కూడా అడ్డుకున్నట్లు రుజువైందన్నారు. ‘బీసీజీ, పోలియోలపై పోరాడేందుకు గతంలో కోట్ల మందికి ఈ టీకాలను ఇచ్చాం. వీటితో బాధితులకు రిస్క్ చాలా తక్కువ. ఇవి శరీరంలో సహజ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కరోనా సహా పలు వైరస్లను నియంత్రించే శక్తి వీటికి ఉంది’అని వీరు తెలిపారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. (కోవిడ్ పేదలు వంద కోట్లు) -
నేటి నుంచి టీకాలు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతకొన్ని రోజులుగా గర్భిణులకు, చిన్నారులకు ఇచ్చే వ్యాధినిరోధక టీకాలు ఆగిపోయాయి. శనివారం నుంచి ఆ టీకాలు యథావిధిగా వేయాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశించారు. ప్రతి బుధవారం, శనివారం రోటావైరస్, డీపీటీ, తట్టు, పోలియో తదితర వ్యాక్సిన్లు ఇస్తారు. నేటి నుంచి జాగ్రత్తలు పాటిస్తూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయాలన్నారు. టీకాలు ఇలా వేయాలి.. ► టీకాలు వేయాల్సిన వాళ్లందరినీ గుర్తించాలి ► వారిలో అరగంటకు నలుగురుకి చొప్పున స్లాట్లు ఇవ్వాలి ► ఆశా కార్యకర్తల ద్వారా ముందురోజే ఈ స్లాట్ సమయం స్లిప్పులు ఇవ్వాలి ► గ్రామ, వార్డు పరిధిలోని లబ్ధిదారులందరికీ టీకాలు వేసే వరకూ స్లాట్లను కొనసాగించాలి ► ఏఎన్ఎంలు గానీ, ఆశాలు గానీ, అంగన్వాడీ వర్కర్గానీ కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే టీకాల్లో పాల్గొనకూడదు ► రెడ్జోన్ (కంటైన్మెంట్ జోన్) ప్రాంతాల్లో టీకాల కార్యక్రమం నిర్వహించకూడదు ► టీకాలకు వచ్చే వారి మధ్య కనీసం 7 అడుగుల భౌతిక దూరం ఉండేలా చూడాలి ► టీకాలు వేసే ఏఎన్ఎం సర్జికల్ మాస్కు ధరించడంతో పాటు టీకా వేసేముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి -
దేశంలో అట్టడుగు స్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : పిల్లలకు టీకాలు వేయడంలో తెలంగాణ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ 35వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది. 2019–20లో ఇప్పటివరకు దేశంలో టీకాలు వేయడంలో తమిళనాడు 148 శాతంతో మొదటిస్థానంలో నిలవగా, అట్టడుగు స్థానంలో సిక్కిం 53.60 శాతం, ఆ తర్వాత తెలంగాణ 54.30 శాతంతో వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా, టీకాలు సరఫరా చేస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వెనుకబడినట్లు కేంద్రం తెలిపింది. 2018–19లో మాత్రం తెలంగాణ 95.98 శాతం టీకాలు వేసింది. 2017–18లో 88.96 శాతం కవర్ చేసింది. కానీ ఈ ఏడాది వెనుకబడినట్లు కేంద్రం తెలిపింది.(6 నుంచి బడ్జెట్ సమావేశాలు) విటమిన్ ఏ టీకాలే తక్కువగా... యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద గిరిజనులు, ఇతర మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు వేస్తారు. మిషన్ ఇంద్రధనుష్, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్, గ్రామ్ స్వరాజ్ అభియాన్ (జీఎస్ఏ) పథకాల కింద ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. బీసీజీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్, హెపటైటిస్ బీ వ్యాక్సిన్, పెంటావాలెంట్ వ్యాక్సిన్, క్రియారహిత పోలియో వైరస్ వ్యాక్సిన్ (ఐపీవీ), మీజిల్స్ రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్, డిఫ్తీరియా, పెర్టుసిస్–టెటానస్ (టీపీటీ), రోటావైరస్ వ్యాక్సిన్ (ఆర్వీవీ) తదితరమైనవి వేయాల్సి ఉంటుంది. ఆ టీకాలు వేయడం వల్ల సంబంధిత రోగాల నియంత్రణే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాలను చేపట్టింది. అయితే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం వ్యాక్సిన్లపై పెద్దగా శ్రద్ధ చూపించడం లేదని కేంద్ర నివేదిక చెబుతోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 80.3 శాతమే పోలియో వ్యాక్సిన్లు వేసినట్లు తేల్చింది. అలాగే తట్టు (మీజిల్స్) టీకాలు 81.9 శాతమే వేశారు. బీసీజీ టీకాలు 83.6 శాతం మందికి వేశారు. ఇవిగాక విటమిన్ ఏ టీకాలు మూడు దశలకు సంబంధించి కేవలం 15 నుంచి 36 శాతం మధ్యే వేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పోలియో వంటి టీకాలను ఇంటింటికీ తిరిగి వేస్తున్నామని, బస్టాండ్లు, స్కూళ్లు, ఆరుబయట ఎక్కడ కనిపిస్తే అక్కడ చిన్న పిల్లలకు వేస్తున్నామని చెబుతున్నా, ఆచరణలో మాత్రం తేడా కనిపిస్తోందని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో టీకాలు అందుబాటులో ఉంచకపోవడం కూడా ఇంత వెనుకబాటుకు ఒక కారణంగా వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. చిన్న పిల్లలకు బీసీజీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్, హెపటైటిస్ బీ వ్యాక్సిన్, పెంటావాలెంట్ వ్యాక్సిన్, క్రియారహిత పోలియో వైరస్ వ్యాక్సిన్ (ఐపీవీ), మీజిల్స్ రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్, డిఫ్తీరియా, పెర్టుసిస్–టెటానస్ (టీపీటీ), రోటావైరస్ వ్యాక్సిన్ (ఆర్వీవీ) తదితర టీకాలు వేయాల్సి ఉంటుంది. -
‘కలుషిత పోలియో’ కలవరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ కలుషిత పోలియో మందు కలవరం సృష్టిస్తోంది. కేంద్రం ప్రకటించిన బ్యాచ్ నంబర్–బీ10048 కలుషిత వ్యాక్సిన్లను రాష్ట్రంలోని అనేకమంది చిన్నారులకు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు నిర్ధారించాయి. ఎంతమంది చిన్నారులకు వేశారో లెక్క తేలడం లేదు. ఆయా వ్యాక్సిన్ల వల్ల చిన్నారులకు ఎలాంటి ప్రమాదం తలెత్తదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశా రు. అవి ఏమాత్రం కలుషితమైనవి కావని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఓఎస్డీ, నిమ్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ తాడూరి గంగాధర్ అన్నారు. కలుషిత వ్యాక్సిన్లు వాడారన్న ప్రచారంతో పిల్లల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పిల్లల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 ఏప్రిల్ తర్వాత పుట్టిన పిల్లలకు వాడకం తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ల్లోని చిన్నారులకు ఈ వ్యాక్సిన్లు వేయించారని వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఘజియాబాద్ బయోమెడ్ సంస్థ వీటిని తయారు చేసింది. 3 బ్యాచ్ల్లో 1.5 లక్షల యూనిట్ల కలుషిత వ్యాక్సిన్లను పంపిణీ చేయగా 2016 ఏప్రిల్ తర్వాత పుట్టిన పిల్లలకు వీటిని వేశారు. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాక్సిన్లను చాలాకాలం క్రితమే వెనక్కి తీసుకున్నారు. టైప్–2 పోలియో వైరస్తో కలుషితమైన ఈ పోలియో చుక్కల ద్వారా ఇప్పటికే నాశనమైన ఓ వైరస్ చిన్నారుల్లోకి తిరిగి ప్రవేశించే అవకాశముంది. కలుషితమైనట్లు చెబుతున్న వ్యాక్సిన్లు రాష్ట్రంలో 15 లక్షల డోసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. వాటిని వెనక్కి తెప్పిస్తున్నామని, కొన్నింటిని తెప్పించామంటున్నారు. పోలియో రహితంగా ప్రకటించినా... 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని ‘పోలియో ఫ్రీ’ దేశంగా ప్రకటించింది. 2016లో టైప్–2 స్ట్రెయిన్ ఉండే వ్యాక్సిన్లను మొత్తం వెనక్కు తీసుకుంది. మన దేశం అప్పటికే ఉన్న టైప్–2 వ్యాక్సిన్ నిల్వలను ధ్వంసం చేసింది. ఏప్రిల్ 2016 తర్వాత టైప్–1 లేదా టైప్–3 వ్యాక్సిన్లు బైవాలెంట్ వ్యాక్సిన్లనే అమ్మాలి. కానీ, ఘజియాబాద్ కంపెనీ నిషేధిత టైప్–2 వ్యాక్సిన్ ఎలా సరఫరా చేసింద నేది ప్రశ్నార్థకంగా మారింది. నెల క్రితం రాష్ట్రంలో పెంటావాలెంట్ టీకాతో ఓ చిన్నారి మృతి చెందిం ది. కొందరికి ప్రభుత్వమే హైదరాబాద్లో చికిత్స చేయించింది. దీనిపై సర్కారు నివేదిక తయారు చేసినా దాన్ని బయటకు పొక్కనీయలేదు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
Advertisement