కడప ఎడ్యుకేషన్: విద్యార్థులు ఏవిషయంలోనైనా ఓటమి చెందామని మనస్తాపం చెందవద్దని, ఆ ఓటమే రేపటి విజయానికి తొలిమెట్టు అవుతుందని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప నగరం మరియాపురంలోని సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మంగళవారం ఇన్స్పైర్ ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీఈఓ అంజయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను విద్యాశాఖ నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఒకప్పుడు రత్నాల సీమగా ఉన్న రాయలసీమ నేడు రాళ్ల సీమగా మారిందన్నారు. విద్యార్థులు బాగా చదివి మంచి స్థాయికి ఎదిగి రాళ్ల సీమ పేరును రత్నాల సీమగా మార్చాలన్నారు. నేడు విద్యారంగం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఎగ్జిబిట్స్ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలన్నారు. సంబంధిత కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. సంబంధిత విషయంలో తమవంతు కృషి చేస్తానన్నారు.
రాష్ట్రస్థాయిలో ఇన్స్పైర్ను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. డీఈఓ అంజయ్య మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఎంపికైన స్ఫూర్తితోనే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని సూచించారు. ఈ ప్రాజెక్టుల తయారీకి పిల్లల మేథాశక్తిని కొనియాడారు. పిల్లలు చదవుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఎదిగి దేశం పేరు నిలబెట్టాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక నూతన ఒరవడితో ముందుకు సాగాలన్నారు.డిప్యూటీ డీఈఓ రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్న ఇన్స్పైర్ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఇన్స్పైర్లో ప్రతి ప్రధానోపాధ్యాయుడు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు.
ప్రతి పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేసి దాని పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. వయోజన విద్య ఉపసంచాలకులు సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న చిన్న ప్రయోగాలతోనే విద్యార్థులకు ప్రేరణ వస్తుందన్నారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం మంది విద్యకు దూరంగా ఉన్నారన్నారు. ఎంఈఓ నాగమునిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాల ఈ సైన్స్ ఫెయిర్లో పాల్గొనడానికి ముందుకు రావాలన్నారు. వీటితోపాటు ప్రైవేటు పాఠశాలలు కూడా పాల్గొనవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి రెహ్మాన్, డీఈఓ కార్యాలయ ఏడీ సుబ్రమణ్యం, డీసీఈబీ సెక్రటరీ వెంకట రామిరెడ్డి, వైవీయూ అధ్యాపకులు వెంకట్రామ్, ఉస్మాన్, హెడ్మాస్టర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షులు రామచంద్రారెడ్డి, మరియాపురం స్కూలు సిస్టర్స్ శీల, లీలా రోజ్, పలు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు రమణారెడ్డి, రమేష్రెడ్డి, సుబ్బారెడ్డి, లలితాభాయి, మేషక్బాబు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓటమి విజయానికి తొలి మెట్టు
Published Wed, Aug 27 2014 2:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement