కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా సెక్రటరీ, వరద ప్రభావిత స్పెషల్ ఆఫీసర్ వికాస్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి, జేడీఏ ఠాగూర్నాయక్ తదితర అధికారులతో తుపాను పీడిత ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి, జేసీ కన్నబాబు పాల్గొన్న సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో 15 మండలాల్లో 45 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, బాధితులకు తక్షణం తగిన చేయూతనిచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మకూరు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల కాలనీలను వరదనీరు ముంచెత్తడంతో ఇళ్లు దెబ్బతినడంతో బాధితులు అన్ని రకాలుగా నష్టపోయారని, వీరికి బియ్యం, కిరోసిన్ తదితర నిత్యావసర వస్తువులను ఆదివారం నుంచే సరఫరా చేయాలని జేసీ కన్నబాబును ఆదేశించారు.
వరద తీవ్రతకు దెబ్బతిన్న ఇరిగేషన్ ట్యాంకులు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లు, ఇళ్లు తదితరాలను పరిశీలించి నష్టం అంచనాలు వేసి, వాటికి మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లడంతో వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఆదివారం నుండే ప్రత్యేక బృందాలతో సమగ్రంగా సర్వే చేయించాలని జేడీఏ ఠాగూర్నాయక్ను ఆదేశించారు.
దెబ్బతిన్న తాగునీటి పథకాలను పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. వరద ప్రభావిత గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించాలన్నారు. సమావేశంలో డీఆర్వో వేణుగోపాల్రెడ్డి, సీపీఓ ఆనంద్నాయక్, జేడీఏ ఠాగూర్నాయక్, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, ఆర్డీఓలు కూర్మానాథ్, నరసింహులు, హౌసింగ్ పీడీ రామసుబ్బు, డీపీఓ శోభ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.
స్పందించండి
Published Sun, Oct 27 2013 4:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement