ఆ ముగ్గురూ ‘సిద్ధార్థ’ విద్యార్థులు | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురూ ‘సిద్ధార్థ’ విద్యార్థులు

Published Wed, Mar 23 2016 12:33 PM

the three young people killed Krishna river

హోలీ పండుగనాడు విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర ఘాట్ రైల్వే వంతెన వద్ద కృష్ణా నదిలో మునిగి ముగ్గురు యువకులుమృతి చెందారు. బుధవారం ఉదయం హోలీ వేడుకల అనంతరం స్నానానికి వచ్చిన వీరు ఇలా మృత్యువాతపడడం స్థానికంగా విషాదం నింపింది.

కాగా.. కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందిన ముగ్గురు విద్యార్థులు విజయవాడ సిద్ధార్థ కళాశాల విద్యార్థులని తేలింది. సాయికృష్ణ, సంతోష్, సుభాష్‌లు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. స్వస్థలం విజయవాడ నగరం పటమటలోని కొత్తపేటగా గుర్తించారు. మరి కొందరు స్నేహితులతో కలిసి బుధవారం హోలీ వేడుకలు జరుపుకున్న అనంతరం స్నానం చేసేందుకు కృష్ణా నదిలో దిగినట్లు తెలిసింది.
 

Advertisement
Advertisement