రోడ్డు ప్రమాదంలో ఒకరు...
సీతానగరం: మండలంలోని బక్కుపేట–చినబోగిలి గ్రామా ల మధ్య శనివారం ఆటో – మోటారు సైక్లిస్ట్లు ఎదురెదురుగా ఢీకొట్టిన ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన వైనమిది. పోలీసులు తెలిపిన వివరాలు...మండలంలోని తామరఖండి గ్రామానికి చెందిన శంబంగి శ్రీనివాసరావు(42) శనివారం బక్కుపేటలో ఇటుకల నిమిత్తం వెళ్లారు. అదే సమయంలో బళ్లక్రిష్ణాపురం గ్రామానికి చెందిన బి.త్రినాధ్ ఆటోలో కూలీలను చినబోగిలి నుంచి బక్కుపేట తీసుకెళ్తుండగా ఎదురుగా వస్తున్న మోటార్ సైక్లిస్ట్ శ్రీనివాసరావు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయాల పాలైన శ్రీనివాసరావును బొబ్బిలి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా పరిస్థితి విషమించడంతో విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలియజేశారు. ఎస్ఐ డి.సాయిక్రిష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
ఆటో నుంచి జారిపడి మరొకరు...
పూసపాటిరేగ: స్థానిక గొల్లపేట సమీపంలో జాతీయ రహదారిపై శని వారం సాయంత్రం ఆటో నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే...పోరాం గ్రామానికి చెందిన దొంతల రామునాయుడు (55) వెంపడాంలో వున్న తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తుండగా గొల్లపేట సమీపంలో ఆటో నుంచి జారిపడటంతో తీవ్ర గాయాలు పాలై అక్కడకక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రామకృష్ణ, కుమారులు గురునాయుడు, రాజినాయుడు వున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజ యనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎస్ఐ జి.కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు బోల్తా... డ్రైవరు మృతి
భోగాపురం: స్థానిక సుందరపేట సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ తారకేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్ని ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవరు శ్రీరామ్ సంపత్ రావు (40) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఐదుగురుకి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక సీహెచ్సీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.