జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతి

Published Thu, Oct 2 2014 12:30 PM

Three Suspects in deaths in ysr district

ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ జిల్లాలో ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రొద్దుటూరులోని తళ్లెం నగల దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం షాపు తెరచిన సిబ్బంది ముగ్గురు మృతి చెందటాన్ని గమనించారు.

 

వారు  పొగ వల్ల ఊపిరి ఆడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాజమాన్యం కూడా దీనిపై పెదవి విప్పటం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి యత్నం జరిగిందా? లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement