నేడు పెద్దాపురంలో బహిరంగ సభ | Sakshi
Sakshi News home page

నేడు పెద్దాపురంలో బహిరంగ సభ

Published Wed, Jul 25 2018 7:25 AM

Today YS Jagan Public Meeting In Peddapuram East Godavari - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 220వ రోజు బుధవారం పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట, పెద్దాపురం పట్టణ ప్రాంతాల్లో కొనసాగనుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కష్టాల్లో ఉన్న వారికి భరోసానిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న పాదయాత్ర సామర్లకోటలోని గణపతి నగర్‌ నుంచి ప్రారంభం కానుంది. పెద్దాపురం వేములవారి సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరిగే బహిరంగ సభలో జగన్‌  ప్రసంగించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను పార్టీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement