వై.రామవరం :వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ డొంకరాయి పరిసర గ్రామాల్లో శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు అధ్యక్షతన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పర్యటించారు. వారి వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మొదట డొంకరాయి గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పర్యటన ప్రారంభించారు. రాజు క్యాంపు, బెంగాలీ క్యాంపు, మర్రిగూడ, బచ్చలూరు, నర్సింగ్పూర్, తదితర గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో గిరిజన సంప్రదాయం ప్రకారం వారికి ఆయా గ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతు బొడ్డగండి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మండల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస గిరిజనుల సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. అనంతరం అనంతబాబు మాట్లాడుతు ఆయా గ్రామాల్లోని వలస గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బతుకు తెరువుకోసం ఇక్కడకు దశాబ్దాల క్రితం వలసి వచ్చిన గిరిజనులందరికీ భూమి పట్టాలు, పక్కా ఇళ్లు, కులధ్రువీకరణ పత్రాల మంజూరుకు ఎమ్మెల్యే తోపాటు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పింఛన్ల పునరుద్ధరణకు పోరాడుతా
రుణమాఫీ పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని మంగంపాడు, డొంకరాయి గ్రామాల్లో శనివారం ‘జన్మభూమి-మాఊరు’ సభలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజేశ్వరి మాట్లాడుతూ పింఛన్ల పెంపు పేరుతో అర్హుల పింఛన్లు తొలగించడంపై ఆమె ధ్వజమెత్తారు. అనేక మంది పింఛన్లు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ పింఛన్లు పునరుద్ధరించే వరకు వైఎస్సార్ సీపీ తరఫున పోరాడుతామని ఆమె హామీ ఇచ్చారు. డొంకరాయి, పొల్లూరు, సీలేరు ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రాల కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
‘వలస గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం’
Published Sun, Nov 9 2014 12:38 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
భారత్లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వెబినార్
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
భారత్ అత్యంత పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
2014-22 మధ్య ఆప్ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది: ఈడీ
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత
తప్పక చదవండి
- భారత్ అత్యంత పేద దేశం.. 2050 నాటికి అందరూ ధనవంతులవుతారా?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement