-
జడివానలో సుడిగాలి పర్యటన
- గిరిజనుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ - బెంగళూరు తరహాలో కాఫీ అభివృద్ధికి చర్యలు - పిల్లలను పాఠశాలకు పంపకుంటే రేషన్ కార్డు రద్దు చింతపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ జోరువానలోను సుడిగాలి పర్యటన జరిపారు. ముందుగా లంబసింగి ప్రాంతాన్ని సందర్శించిన ఆయన అక్కడ గిరిజనులు సాగు చేస్తున్న కాఫీతోటలను పరిశీలించారు. బెంగళూరు తరహాలో కాఫీలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు రైతులకు మెలకువలు నేర్పిస్తామని, ఈ మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ఎంపిక చేసిన కొందరు రైతులకు అవగాహన కల్పించేందుకు బెంగళూరుకు పంపిస్తామన్నారు. లంబసింగి ప్రాంతంలోని మహిళలు, గిరిజనులతో మాట్లాడుతూ పిల్లలను పాఠశాలలకు పంపించే బాధ్యత తల్లితండ్రులే వహించాలన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపించకపోతే రేషన్కార్డులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తాజంగిలో ఐటీడీఏకు చెందిన వ్యవసాయ క్షేత్ర భూములు పరిశీలించారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు 38 ఎకరాల భూమిని టూరిజం శాఖకు అప్పగించడంతో ఇంతకాలం ఆ భూములను నమ్ముకొనివున్న తాము రోడ్డున పడతామని స్థానిక గిరిజనులు మొరపెట్టుకున్నారు. అర్హులైన పేదలకు న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పారు. స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిని సందర్శించారు. పీహెచ్సీ భవనానికి విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్రాలగొప్పు గ్రామాన్ని సందర్శించి పండ్ల వ్యాపారాన్ని పరిశీలించారు. చింతపల్లిలో ఆస్పత్రి, యువజన శిక్షణ కేంద్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ఎం.హరినారాయణన్, సబ్కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్, చింతపల్లి డీఎస్పీ రాఘవేంద్ర, కాఫీ ప్రాజెక్టు అధికారి చిట్టిబాబు, డీఈ మోహన్రావు, జేఈలు జయరాం, వెంకటరమణ, ఎంపీడీఓ సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. రక్తహీనత నివారణకు చర్యలు చింతపల్లి: బాలికల్లో రక్తహీనత నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యువరాజ్ అన్నారు. శనివారం చింతపల్లి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లోని 12 ఏళ్లు పైబడిన బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుందని, దాని నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. లంబసింగి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకశాఖ చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. ఏజెన్సీలో వైద్య ఆరోగ్యశాఖ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మాతా, శిశు మరణాల నివారణకు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూరుకుపోయిన పీవో కారు చింతపల్లి: మండలంలోని చిట్రాలగొప్పు వద్ద పాడేరు ఐటీడీఏ పీఓ హరినారాయణన్ కారు బురదలో కూరుకుపోయింది. దీంతో కొంతసేపు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. కలెక్టర్ యువరాజ్తోపాటు చిట్రాలగొప్పు వచ్చిన పీఓ కారు వెనక్కు తిప్పుతుండగా బురదలో కూరుకుపోయింది. దీంతో పీఓను కలెక్టర్ తన కారులో తీసుకుపోయారు. కొంత సేపటికి సిబ్బంది కారును రోడ్డెక్కించి ఊపిరిపీల్చుకున్నారు. చిన్నారికి కలెక్టర్ లాలింపు చింతపల్లి: జిల్లా కలెక్టర్ యువరాజ్ శనివారం చిట్రాలగొప్పులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అధికారుల బృందమంతా ఒకేసారి అంగన్వాడీ కేంద్రానికి వస్తుండటంతో అక్కడ ఉన్న ఒక చిన్నారి ఏడుపు అందుకుంది. దీంతో కలెక్టర్ యువరాజ్ ఆ చిన్నారిని స్వయంగా ఎత్తుకొని లాలించి ఓదార్చారు. అక్కడ ఉన్న బొమ్మలు, ఆట వస్తువులు చూపిస్తు చంటిపాప ఏడుపును నిలువరించారు. అక్కడ పిల్లలకు పెడుతున్న పోషకాహారాన్ని పరిశీలించారు. -
‘వలస గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం’
వై.రామవరం :వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ డొంకరాయి పరిసర గ్రామాల్లో శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు అధ్యక్షతన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పర్యటించారు. వారి వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మొదట డొంకరాయి గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పర్యటన ప్రారంభించారు. రాజు క్యాంపు, బెంగాలీ క్యాంపు, మర్రిగూడ, బచ్చలూరు, నర్సింగ్పూర్, తదితర గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో గిరిజన సంప్రదాయం ప్రకారం వారికి ఆయా గ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతు బొడ్డగండి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మండల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస గిరిజనుల సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. అనంతరం అనంతబాబు మాట్లాడుతు ఆయా గ్రామాల్లోని వలస గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బతుకు తెరువుకోసం ఇక్కడకు దశాబ్దాల క్రితం వలసి వచ్చిన గిరిజనులందరికీ భూమి పట్టాలు, పక్కా ఇళ్లు, కులధ్రువీకరణ పత్రాల మంజూరుకు ఎమ్మెల్యే తోపాటు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పింఛన్ల పునరుద్ధరణకు పోరాడుతా రుణమాఫీ పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని మంగంపాడు, డొంకరాయి గ్రామాల్లో శనివారం ‘జన్మభూమి-మాఊరు’ సభలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజేశ్వరి మాట్లాడుతూ పింఛన్ల పెంపు పేరుతో అర్హుల పింఛన్లు తొలగించడంపై ఆమె ధ్వజమెత్తారు. అనేక మంది పింఛన్లు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ పింఛన్లు పునరుద్ధరించే వరకు వైఎస్సార్ సీపీ తరఫున పోరాడుతామని ఆమె హామీ ఇచ్చారు. డొంకరాయి, పొల్లూరు, సీలేరు ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రాల కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కౌంటీల్లో ఆడనున్న సన్రైజర్స్ మాజీ బౌలర్
ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement