Sakshi News home page

తాగునీటి కోసం గిరిజనుల ధర్నా

Published Thu, Aug 13 2015 12:37 PM

Tribals dharna at chittoor distiict

తంబళ్లపల్లె: చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం ఆర్‌ఎల్ తాండా రెండు నెలలుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. బోర్లు ఎండిపోవడంతో గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. రెండు నెలలుగా నీటి ట్యాంకర్లను నిలిపివేశారు. అప్పటినుంచి పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా నీరు సరఫరా చేయలేదు. పొరుగు గ్రామాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. విసిగిపోయిన గ్రామస్తులు గురువారం ఉదయం ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో వారు కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement