టీటీడీ బోర్డు మెంబర్‌గా పుట్టా | Sakshi
Sakshi News home page

టీటీడీ బోర్డు మెంబర్‌గా పుట్టా

Published Tue, Apr 28 2015 2:32 AM

ttd board member as putta Sudhakar Yadav

సాక్షి ప్రతినిధి, కడప : మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు నామినేటెడ్ పదవి వరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టర్‌గా ఎదిగిన పుట్టా సుధాకర్ అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేశారు. టీడీపీ మైదుకూరు నియోజకవర్గ బాధ్యతలు భుజానికి ఎత్తుకొని సింగిల్ విండో, పంచాయతీ,ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తనకంటూ వర్గం ఏర్పడేందుకు డబ్బును మంచి నీళ్లు చందాన ఖర్చు చేశారు.

టీడీపీ అభ్యర్థిగా మైదుకూరు నుంచి పోటీ చేసి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినా ఫలితం  లేకుండా పోయింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా భారీ ఓటమిని మూట గట్టుకోవడంతో ఆయనలో ఒకరకమైన నిర్వేదం చోటు చేసుకున్న తరుణంలో వియ్యంకుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ద్వారా నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నించారని సమాచారం. అందులో భాగంగానే టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం లభించినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement