► చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు
► అవగాహన లేమితో అనర్థాలు
చిత్తూరు : పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకుంటూ ఉంటారు. దత్తత తీసుకునేందుకు ప్రభుత్వం విధించిన విధి విధానాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కొందరు వాటికి కట్టుబడకుండా అక్రమంగా పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. ఇలా చేయడం తప్పు అని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదని పేర్కొంటున్నారు.
అవగాహన లేమితో అనర్థాలు కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేసుకున్న ఒప్పందం కొంతకాలం తరువాత బయటపడుతుండడంతో జన్మనిచ్చిన తల్లులే కాకుండా పెంచుకున్న తల్లులు కూడా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అభం, శుభం తెలియని చిన్నారులు ఏ తల్లి ఒడికీ చేరక శిశు గృహాలకే చేరుకుంటున్నారు.
దత్తత తీసుకోవాలంటే..
పిల్లలు లేని దంపతులకు ఆ లోటు ఉండకూడనే ఉద్దేశంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ దత్తత పక్రియను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక విభాగం కూడా ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో శిశు గృహాలను ఏర్పాటు చేశారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆ లోటును పూడ్చేందుకు, అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చేందుకు ఐసీడీఎస్ పని చేస్తోంది. 15 ఏళ్లలోపు బాలబాలికలను దత్తతకు అర్హులు. దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు వారి అర్హత ఆధారంగా పిల్లలను ఇస్తారు. పిల్లలను దత్తత తీసుకోవాలనే వారు ఆన్లైన్లో దరఖాస్తును పూరించాలి.
భార్యాభర్తల ప్రస్తుత ఫొటో, వారి వయస్సు, ఇంటి చిరునామా, నివాస, ఆధార్ కార్డులు, ఆదాయ (రూ.లక్షకు పైగా ఉండాలి), వేతనం, వివాహ ధ్రువీకరణ పత్రాలతోపాటు పాన్ కార్డు నమోదు చేయాల్సి ఉంటుంది. ఐసీడీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. దత్తత తీసుకునే తల్లిదండ్రులు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించుకుని ఫిట్నెస్ సర్టిపికెట్లను అధికారులకు అందజేయాలి.
భవిష్యత్తులో ఇబ్బందులు
అక్రమ పద్ధతిలో దత్తత తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అర్హులు పిల్లలను దత్తత తీసుకోవచ్చు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
– లక్ష్మీ, ఐసీడీఎస్, పీడీ
పిల్లలను దత్తత తీసుకుంటున్నారా..అయితే !
Published Fri, Aug 11 2017 11:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement