వత్సవాయి, న్యూస్లైన్ : పిల్లల ఉన్నత చదువులు, పెళ్ళిళ్లు, వ్యవసాయ పనులు తదితర అవసరాల కోసం స్థానిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఖాతాదారులు దాచుకున్న సొమ్మును సిబ్బంది గోల్మాల్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారుల్లో కొందరు సొసైటీ కార్యాలయానికి వచ్చి తాము దాచుకున్న డబ్బు తమ ఖాతాలలో లేదని తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం ఒక్కరోజు వచ్చి న సొసైటీకి వచ్చిన బాధితులకు సంబంధించిన ఖాతాల్లో రూ.10 లక్షలకు పైగా మాయం అయినట్లు తేలింది.
ఇంకా ఈ విషయం తెలియని వారు ఎక్కువమంది ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సొసైటీలో రెండువేల మందికి పైగా సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలోనే నగదు మాయం అయినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. సొసైటీలో రూ.2.20 కోట్లకు పైగా డిపాజిట్లు ఉండగా, రూ.2 కోట్లకు పైగా బంగారు వస్తువులపై రుణాలు మంజూరు చేసినట్లు తెలి సింది. ఖాతాదారులు సొసైటీలో నగదు జమ చేసినప్పుడు వారి పాసు పుస్తకాలలో సిబ్బంది నమో దు చేశారు. సొసైటీ క్యాష్ రికార్డులలో మాత్రం ఎంట్రీలు లేవని, ఖాతాదారుల సొమ్మును సిబ్బంది సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది.
సొసైటీ క్యాషియర్ నాగేశ్వరరావు నాలుగు రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఖాతాదారులు కొందరు కార్యాలయానికి వచ్చి తమ ఖాతాల వివరాలు తెలుసుకోగా, నగదు మాయం అయిన విషయం వెలుగులోకి వచ్చింది. సొసైటీలో సొమ్ము దాచుకున్న షేక్ జాన్మియా, కుక్కల ప్రసా ద్, కంచేటి రామారావు, షేక్ జాన్వలీ, ఎం.వెంకటేశ్వర్లు, మౌలాబీ, కొలుసు గంగిరాజు, పట్టాభి, ఆదాం సాహెబ్, వైకుంఠపు రామారావు, కంచం శ్రీను, ఎన్ వెంకటేశ్వర్లు, కొలికపోగు వెంకటనర్సమ్మ, గజ్జా జాలయ్య ఖాతాల నుంచి నగదు మాయమైనట్లు తేలింది.
ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు కొందరు కార్యాలయానికి వచ్చారు. అక్కడ సమాధానం చెప్పే వారు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై సొసైటీ కార్యదర్శి చిట్టూరి శ్రీనివాసరావు, క్యాషియర్ రాయల నాగేశ్వరరావును వివరణ కోరగా, ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, సొమ్ము రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.
వత్సవాయి సొసైటీలో గోల్మాల్ !
Published Sat, Sep 7 2013 3:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
Advertisement