`తెలంగాణ బిల్లు అంశంపై త్వరలో రాష్ట్రపతిని కలుస్తాం` | Sakshi
Sakshi News home page

`తెలంగాణ బిల్లు అంశంపై త్వరలో రాష్ట్రపతిని కలుస్తాం`

Published Fri, Dec 20 2013 5:33 PM

`తెలంగాణ బిల్లు అంశంపై త్వరలో రాష్ట్రపతిని కలుస్తాం` - Sakshi

హైదరాబాద్: తెలంగాణ బిల్లు వ్యవహారంపై త్వరలో తాము రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు అంశంపై తెలంగాణ ఎమ్మెల్యేల సంతకాలతో రాష్ట్రపతికి నివేదిస్తామని ఆయన అన్నారు.
 
అంతేకాకుండా తాజా పరిణామాలను సభల ద్వారా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు ఆమోదించే బాధ్యత తెలంగాణ మంత్రులదేనని కోదండరాం స్పష్టం చేశారు.

Advertisement
Advertisement