జాగరం(జామి): మండలంలోని జాగరం రెవెన్యూ పరిధి రాజుగారి సేరిపొలంలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పశువుల కాపర్లు పొలంలో ఉన్న మహిళ మృతదేహన్ని చూసి పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమచారం అందించారు. ఆదివారం సాయంత్రం ఎస్సై ఎస్.ఎం.ప్రశాంత్కుమార్, తహశీల్దార్ ఆర్.ఎర్నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు.
మృతిపై అనేక అనుమానాలు
మృతదేహం పడి ఉన్న తీరును బట్టి ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేశారా? లేక ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం పక్కన చిన్న వాటర్ బాటిలు ఉంది. మృతురాలి వయసు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఘటన జరిగి ఐదారు రోజులై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండి దుర్వాసన వస్తోంది. సమీపంలోని పావడ గ్రామంలో ఇటీవల గ్రామ దేవత పండగ జరిగింది. ఈ పండగకు వచ్చిన మహిళ అయి ఉంటుందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఎస్సై ప్రశాంతకుమార్ మాట్లాడుతూ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామన్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
Published Mon, May 25 2015 12:17 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement