మహిళ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువుల ఆరోపణ
సాక్షి, కాకినాడ: ఒకే పేరు ఉన్న ఇద్దరు మహిళలు వేర్వేరు సమస్యలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అయితే వారిలో ఒకరికివ్వాల్సి ఇంజెక్షన్ మరొకరికి ఇవ్వడం తో ఓ మహిళ మరణించిందంటూ మృతురాలి బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు. బాధితుల కథనం మేరకు.. ఈనెల 14న వేట్లపాలేనికి చెందిన మాదాసు సత్యవతి(55) జ్వరంతో, గోకవరానికి చెందిన మాదిరెడ్డి సత్యవతి(55) ఊపిరితిత్తుల వ్యాధితో ఈ నెల 19న ఆస్పత్రిలో చేరారు. కేస్ షీట్లలో ఇద్దరి పేర్లను ఎం.సత్యవతిగా రాసుకున్నారు. మాదాసు సత్యవతికి మంగళవారం రాత్రి ఇంజెక్షన్ ఇవ్వగా తెల్లారేసరికి ఆమె చనిపోయింది.
మాదిరెడ్డి సత్యవతికి మంగళవారం రాత్రి ఆక్సిజన్ అందడం లేదని మరో వార్డుకు తరలించారు. బుధవారం ఉదయం డ్యూటీ డాక్టర్ హర్షవర్ధన్ మాదాసు సత్యవతి చనిపోయినట్టు తెలుసుకుని డిశ్చార్జికి బంధువుల సంతకం కోరారు. అయితే అందులో ఊరి పేరు గోకవరం అని ఉండటంతో మంగళవారం రాత్రి మాదిరెడ్డి సత్యవతిని వార్డు మార్చేటప్పుడు కేస్ షీట్లు మారిపోయి ఉంటాయని, ఆమెకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్ తన తల్లికి ఇవ్వడం వల్లే మరణించిందని మృతురాలి కుమార్తె అరుణ అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహంతో బంధువులు అస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట బుద్ధ మాట్లాడుతూ రోగిని తరలించే క్రమంలో కేస్ షీట్ తారుమారయినా వైద్యంలో ఎలాంటి లోపం లేదన్నారు. మృతురాలికి అంతర్గత అవయవాలు పాడయ్యాయని ముందుగానే బంధువులకు చెప్పి పలు పరీక్షలు సైతం చేశామన్నారు.
ఒకరికివ్వాల్సిన ఇంజక్షన్ మరొకరికి..!
Published Thu, Nov 21 2013 1:56 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement