రేపటినుంచే ఏడుపాయల జాతర
అంతా అస్తవ్యస్తం
గుంతలమయంగా రోడ్లు..
సా..గుతున్న స్నానఘాట్లు
మొద్దునిద్రలో అధికారులు
కలెక్టర్ ఆదేశించినా చలనంలేని వైనం
పాపన్నపేట, న్యూస్లైన్:
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది ఏడుపాయల జాతర పరిస్థితి. జాతర ముహూర్తం దగ్గర పడుతున్నా అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు. 15 రోజుల ముందే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించినా.. తాజాగా కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించినా జాతర పనులు ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారుల పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ఏడుపాయల కమాన్, ఆర్అండ్బీ రోడ్డు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో గల ఏడుపాయల ఆలయం వరకు సింగిల్ రోడ్డు ఉంది. ఇది పూర్తిగా శిథిలం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతరకు వేలాది వాహనాలు, లక్షలాది భక్తులు తరలి రానుండటంతో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న గోతులను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ. 50 వేలు కేటాయించారు. గురువారం నుంచే జాతర ప్రారంభం అవుతున్నా ఇంకా పనులు పూర్తి కాలేదు.
ఇరుపక్కల చెట్లతో అనేక వంకలు తిరిగిన ఈ రోడ్డుపై సాధారణ సమయాల్లోనే ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుంది. సాయంత్రం వరకూ విద్యుత్ శాఖ అధికారులు స్తంభాల పక్కన గల చెట్లనునరికేస్తూనే ఉన్నారు. విద్యుత్ సరఫరాలో పలుమార్లు అంతరాయం ఏర్పడుతుండటంతో జాతరలో తాగునీటి సరఫరా ఆగిపోయింది. కనీసం టాయిలెట్లకు నీరురాక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానఘాట్ల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఘనపురం ఆనకట్ట వద్ద విడుదల చేసిన నీరు వేగంగా వచ్చే అవకాశం ఉన్నందున అప్పుడే నిర్మించిన స్నానఘాట్లు ఏమేరకు తట్టుకుంటాయోనని భక్తులు వాపోతున్నారు.
ఘనపురం ఆనకట్ట అవతల చిన్నఘనాపూర్ వైపు రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని, భక్తులు ఆరోపిస్తున్నారు. కాగా పంచాయతీ సిబ్బంది ఇంకా విధుల్లో చేరక పోవడంతో ఏడుపాయల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా పేరుకు పోయాయి. ఇప్పటికే వేలాది మంది భక్తులు ఏడుపాయలకు చేరుకుని ఇబ్బందుల పడుతున్నారు. జాతరలో ఎలాంటి అసౌకర్యాలు కలిగినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశించినా పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పీఆర్ డిప్యూటీ ఈఈ నర్సింలు మాట్లాడుతూ ట్రాక్టర్లు దొరకక రోడ్డు పనులు పూర్తి కాలేదని, త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. ఇన్సులేటర్లు పగిలిపోవడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్కో అధికారులు తెలిపారు.
ఎక్కడి పనులు అక్కడే
Published Tue, Feb 25 2014 11:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement