పాతబస్తీలో శాంతి పరిడవిల్లాలి: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో శాంతి పరిడవిల్లాలి: వైఎస్ జగన్

Published Wed, May 14 2014 3:41 PM

పాతబస్తీలో శాంతి పరిడవిల్లాలి: వైఎస్ జగన్ - Sakshi

హైదరాబాద్: పాతబస్తీలో శాంతి పరిడవిల్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వదంతులు నమ్మొద్దని సూచించారు. శాంతి సామరస్యాలు కాపాడాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో విషయంలో  సంయమనంతో వ్యవహరించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

కిషన్ బాగ్ ప్రాంతంలోని సిక్చావ్నీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు పోలీసులు సహా ఏడుగురు గాయపడ్డారు. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. మృతులు ఇద్దరు పోలీసు కాల్పుల్లో మృతి చెందారా లేక అల్లర్లలో మృతి చెందారా అనేది పోస్టుమార్టంలో తేలుతుందని డీజీ(శాంతిభద్రతలు) వీఎస్కే కౌముది అన్నారు. ప్రస్తుతం కిషన్ బాగ్లో పరిస్థితి అదుపులోనే ఉందని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

Advertisement
Advertisement