సాక్షి ప్రతినిధి, విజయనగరం : రుణమాఫీ దగాతో నష్టపోయిన గంట్యాడ మండలం చంద్రంపేట రైతుల సమస్యను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావిస్తాంచారు. ప్రభుత్వ నిర్వాకాన్ని కేస్ స్టడీస్తో వివరించారు. ప్రభుత్వం విధానాన్ని దుయ్యబట్టారు. గంట్యాడ మండలం చంద్రంపేటలో బండారు రామునాయుడికి 2.63 ఎకరాల భూమి ఉంది. అందులో వరి పండించేందుకు లక్కిడాం ఎస్బీహెచ్లో రూ.50 వేల రుణం తీసుకున్నారు. కానీ ఆయనకు కేవలం రూ.3.10 పైసల రుణం మాత్రమే మాఫీ అయింది. అలాగే అదే గ్రామానికి చెందిన బండారు అప్పలనాయుడికి 2.63 ఎకరాల భూమి ఉంది . వరి పంట నిమిత్తం రూ.50 వేలు రుణం తీసుకున్నారు. రుణ మాఫీలో కేవలం రూ.95 మాత్రమే మాఫీ అయింది.
సోమవారం అసెంబ్లీలో రుణమాఫీ పై చర్చజరిగినప్పుడు వీరిద్దరికీ జరిగిన అన్యాయాన్ని కేస్ స్టడీలుగా తీసుకుని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా, సర్కార్ తీరును ఎండగట్టారు. అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ జరిగినప్పుడు మన జిల్లాలోని గంట్యాడ మండలం చంద్రంపేట రైతులకు చంద్రబాబు చేసిన రుణ మాఫీ దగాను వైఎస్ జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను టీవీల ద్వారా జిల్లాలో చాలా మంది వీక్షించారు. తమ తరఫున అసెంబ్లీలో ప్రస్తావించి, న్యాయం జరిగేలా ప్రతిపక్ష నేత డిమాండ్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు చెప్పినప్పుడే ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని, లోపాలను సరిదిద్దుకుని న్యాయం చేసే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో చంద్రంపేట ప్రస్తావన
Published Tue, Dec 23 2014 2:38 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement