327వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 20 2018 9:13 PM

YS Jagan PrajaSankalpaYatra 327th Day Schedule Released - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 327వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు శుక్రవారం ఉదయం టెక్కని నియోజకవర్గం సంతబొమ్మళి మండలం దండుగోపాలపురం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కాశీపురం మీదుగా దామోదరపురం క్రాస్‌ వరకు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర : రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 326వ రోజు  ప్రజాసంకల్పయాత్ర  గురువారం దండుగోపాలపురం వద్ద ముగిసింది. వైఎస్‌ జగన్‌ ఈ రోజు ఉదయం పాదయాత్రను దుర్గమ్మ పేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లక్ష్మీపురం క్రాస్‌, సవరపేట క్రాస్‌, శివరాంపురం క్రాస్‌, సంతబొమ్మళి, బోరభద్ర క్రాస్‌, జగన్నాథపురం క్రాస్‌, వడ్డి తాండ్ర మీదుగా దండుగోపాలపురం వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది.

Advertisement
Advertisement