వైఎస్సార్‌ జిల్లాలో జగన్‌ మూడు రోజుల పర్యటన | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 10 2019 7:11 PM

YS Jagan Three days Tour In YSR District - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సుధీర్ఘ పాదయాత్రను ముగించుకున్న ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం కాలినడకన సామాన్య భక్తుడిలా తిరుమల చేరిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ రోజు సాయంత్రం శ్రీవారి దర్శనం పూర్తిచేసుకున్నారు. ఈ రోజు రాత్రి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం 9 గంటలకు కడపలోని అమీన్‌పీర్‌ దర్గాను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకొని అక్కడి సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం నేరుగా ఇడుపులపాయకు చేరుకొని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారు.  

Advertisement
Advertisement