నేడు ఏలూరులో వైఎస్సార్ సీపీ సమావేశం | Sakshi
Sakshi News home page

నేడు ఏలూరులో వైఎస్సార్ సీపీ సమావేశం

Published Mon, Dec 1 2014 8:46 AM

YSR Congress Party  Meeting in Eluru

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 5న నిర్వహించే ధర్నా కార్యక్రమానికి తగిన కార్యాచరణ రూపొందించేందు కో్సం సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పార్టీ సమావేశం జరగనుంది. ఏలూరులో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా పరిపాలన సాగడంలేదని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
 
   రైతులు, మహిళలకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని, వారికి రుణాలను మాఫీ చేసేవరకూ తమ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 5న జిల్లా కేంద్రం ఏలూరులో పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు కార్యాచరణ రూపొందించడానికే పార్టీ నాయకుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో పార్టీ జిల్లా అసెంబ్లీ, పార్లమెంట్ కో-ఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంటరీ ఇన్‌చార్జిలు, కేంద్ర పాలక మండలి సభ్యులు, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొంటారని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement