ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి భేటీ | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి భేటీ

Published Sat, Sep 21 2013 11:57 AM

YSR Congress party Meeting in Lotus Pond

హైదరాబాద్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గ్రామస్ధాయి వరకూ తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణతోపాటు, ప్రతి కార్యకర్తను ఇందులో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై చర్చించేందుకు ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం అయ్యింది.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు,  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, చంద్రబాబు టిడిపి నేతల వ్యవహారశైలి తదితర అంశాలపై ఈ సమావేశంలో కూలంకుషంగా చర్చించనున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేబినెట్‌ నోట్‌ తయారైనప్పటికీ సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు స్పందిస్తున్న తీరు...టిడిపి ఆడుతున్న డ్రామాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నేతలు హాజరు అయ్యారున.

Advertisement
Advertisement