రేపు రాజమండ్రిలో వైఎస్సార్ సీపీ భేటీ | Sakshi
Sakshi News home page

రేపు రాజమండ్రిలో వైఎస్సార్ సీపీ భేటీ

Published Sun, Mar 29 2015 2:59 AM

YSR CP meeting in Rajahmundry

ఎమ్మెల్సీ బోస్‌కు స్వాగతంపై చర్చ
 సీజీసీ సభ్యుడు చిట్టబ్బాయి వెల్లడి
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా సమావేశం ఈ నెల 30న రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్టు పార్టీ సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి చెప్పారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాజమండ్రి జగదీశ్వరి రెసిడెన్సీలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశంలో.. ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి జిల్లాకు రానున్న మాజీ మంత్రి, పార్టీ పీ ఏసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఘనంగా స్వాగ తం పలికే విషయమై చర్చిస్తామన్నారు. ఎమ్మెల్సీ పదవితో  జిల్లాను గౌరవించిన పార్టీ అధినేత జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సోదరుడు మృతి చెందడం వల్ల సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను నెహ్రూ తనకు అప్పగించా ర న్నారు. సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా జీ ఎమ్మెల్యేలు, సీజీసీ, సీఈసీ సభ్యులు, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌లు, అనుబంధ కమిటీల అధ్యక్షులు, సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు హాజరు కావాలని కోరారు.
 

Advertisement
Advertisement