-
నేడు జిల్లాకు ఎమ్మెల్సీ బోస్
♦ రావులపాలెంలో ఘనస్వాగతం ♦ ద్రాక్షారామలో సన్మాన సభ ♦ కదలిరానున్న పార్టీ జిల్లా శ్రేణులు ద్రాక్షారామ(రామచంద్రపురం) : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా గురువారం జిల్లాకు రానున్న మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పీఏసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కదలిరానున్నారు. హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ బోస్ కారులో మధ్యాహ్నం రెండు గంటలకు రావుపాలెం చేరుకుంటారు. ముఖ్యనేతలు అక్కడ ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం సీఆర్సీ క్లబ్లో ఏర్పాటు చేసిన లంచ్ను స్వీకరిస్తారు. అనంతరం బోస్ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి , మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ శ్రేణులతో కలిసి జొన్నాడ, మండపేట ప్రధాన రహదారుల మీదుగా మాచవరం చేరుకుంటారు. మాచవరం వంతెన మీద ప్రసన్న విఘ్నేశ్వర సంస్థల అధినేత సత్తివెంకటరెడ్డి ఏర్పాటు చేసిన స్వాగత సత్కారం అందుకున్న అనంతరం పసలపూడి బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు. బైపాస్రోడ్డులోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా రామచంద్రపురం పురవీధుల మీదుగా ద్రాక్షారామ చేరుకుంటారు. భీమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో పైండా వారి సత్రం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికలో బోస్ను ఎమ్మెలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యదర్శిలు, జిల్లా విభాగాల కన్వీనర్లు, మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో సత్కరించనున్నారు. నియోజకవర్గ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే స్వాగత ఏర్పాట్లను పూర్తి చేశారు. రావులపాలెం తరలిరండి : చిర్ల ఎమ్మెల్సీ బోస్కు ఘన స్వాగతం పలికేందుకు కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం తరలి రావాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
రేపు రాజమండ్రిలో వైఎస్సార్ సీపీ భేటీ
ఎమ్మెల్సీ బోస్కు స్వాగతంపై చర్చ సీజీసీ సభ్యుడు చిట్టబ్బాయి వెల్లడి సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా సమావేశం ఈ నెల 30న రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్టు పార్టీ సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి చెప్పారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాజమండ్రి జగదీశ్వరి రెసిడెన్సీలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశంలో.. ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి జిల్లాకు రానున్న మాజీ మంత్రి, పార్టీ పీ ఏసీ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్కు ఘనంగా స్వాగ తం పలికే విషయమై చర్చిస్తామన్నారు. ఎమ్మెల్సీ పదవితో జిల్లాను గౌరవించిన పార్టీ అధినేత జగన్కు కృతజ్ఞతలు తెలియచేస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సోదరుడు మృతి చెందడం వల్ల సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను నెహ్రూ తనకు అప్పగించా ర న్నారు. సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా జీ ఎమ్మెల్యేలు, సీజీసీ, సీఈసీ సభ్యులు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, అనుబంధ కమిటీల అధ్యక్షులు, సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు హాజరు కావాలని కోరారు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement