ఏపీలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తల నియామకం | Sakshi
Sakshi News home page

ఏపీలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తల నియామకం

Published Fri, Jun 10 2016 2:01 AM

ఏపీలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తల నియామకం - Sakshi

సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త సమన్వయకర్తలను నియమించింది. పాయకరావుపేట నియోజకవర్గానికి నలుగురు సభ్యులతో సమన్వయ క మిటీని ఏర్పాటు చేసింది.

మాజీ ఎమ్మెల్యేలు చంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు, పార్టీ నేతలు చుక్కాల రామారావు, వీసం రామకృష్ణలను కమిటీ సభ్యులుగా నియమించింది. యలమంచిలి నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా బొడ్డేడ ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement
Advertisement