Sakshi News home page

‘కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలి’

Published Fri, Nov 6 2015 11:31 AM

ysrcp dharna protest release from KC canal

రాజుపాలెం:  కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చే స్తున్నారు. వైఎస్సార్‌కడప జిల్లా రాజుపాలెం మండలానికి చెందిన రైతులు వైఎస్సార్సీపీ నాయకులు గత కొన్ని రోజులుగా నీటి కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కేసీ కాలువకు నీరు విడుదల చేయాలని లేకపోతే పంటలు నాశనం అవుతాయని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement