‘గడ్కరీ చెప్పినా చంద్రబాబు వినడం లేదు’ | Sakshi
Sakshi News home page

పోలవరాన్ని మాయ ప్రాజెక్ట్‌లా తయారుచేశారు..

Published Tue, Oct 31 2017 3:49 PM

ysrcp leader pardhasarathi slams chandrababu naidu over polavaram project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను మాయ ప్రాజెక్ట్‌లా తయారు చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి పార్థసారధి వ్యాఖ్యానించారు. కేంద్రానికి, రాష్ట్ర ప్రజలకు అర్థం కాకుండా పోలవరాన్ని మార్చారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్థసారధి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రూ.వేల కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడుతున్నప్పటికీ కొత్త కాంట్రాక్టర్‌ను తీసుకు రావాలని ముఖ్యమంత్రి యత్నిస్తున్నారు.

కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినప్పటికీ చంద్రబాబు వినడం లేదు. పోలవరాన్ని ఒక ఆదాయ వనరుగా చంద్రబాబు మార్చుకున్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి చేసి, రాష్ట్రానికి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రం నుంచి పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు లాక్కున్నారు?. పోలవరాన్ని కమీషన్ల ప్రాజెక్ట్‌గా చంద్రబాబు మార్చేశారు. రూ.16వేలకోట్ల ప్రాజెక్ట్‌ను రూ.50వేల కోట్ల ప్రాజెక్టుగా మార్చారు. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో విచారణ చేసి ఏం జరుగుతుందో ప్రజలకు కేంద్రం చెప్పాలి. పోలవరం ఖర్చుపై కేంద్రం ఏ చెప్పిందో స్పష్టత ఇవ్వాలి. మీకు ముడుపులు చెల్లించే కాంట్రాక్టర్‌ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వైఎస్‌ఆర్‌ సీపీ చూస్తూ ఊరుకోదు.’ అని ఆయన హెచ్చరించారు.

కేంద్రమంత్రి చెప్పినా చంద్రబాబు వినడం లేదు 

Advertisement
Advertisement