ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభపై సమావేశం నేడు | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభపై సన్నాహక సమావేశం నేడు

Published Fri, Jan 4 2019 7:45 AM

YSRCP Meeting on Praja Sankalpa Yatra Closing Public Meeting - Sakshi

శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ): ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ఈ నెల 9వ తేదీతో ముగియనున్నదని, ఇచ్ఛాపురంలో నిర్వహించనున్న ముగింపు సభ విజయవంతం చేయాలని కోరుతూ శ్రీకాకుళంలో శుక్రవారం విస్తృతస్థాయి కార్యనిర్వాహక, కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం తెలిపారు. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో గురువారం స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఈ సమావేశానికి జిల్లాలో 10 నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ మండల అధ్యక్షులు, అనుబంధ సంస్థ అధ్యక్షులు, కార్యవ ర్గ సభ్యులు, బూత్‌కమిటీ కన్వీనర్లు, వివిధ స్థాయిల్లో కేడర్‌ ముఖ్య నాయకులంతా ఉదయం 10 గంటలకు హాజరవ్వాలని కోరారు. ఈ సమావేశంలో 9వ తేదీన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభ ఏర్పాట్లపై చర్చించడం జరుగుతుందన్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు అధిక సంఖ్యలో వైఎస్సార్‌ సీపీ అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
Advertisement