న్యూఢిల్లీ: అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గతేడాది హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు 4 శాతం క్షీణించి 16,500కి పరిమితమయ్యాయి. అయితే, తెలంగాణ ఏర్పాటు వల్ల అనిశ్చితి తొలగిపోవడంతో ఈ ఏడాది ఆఖరు నుంచి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమ్మకాలు మళ్లీ పుంజుకోనున్నాయి. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. 2012తో పోలిస్తే 2013లో నివాస గృహాల అమ్మకాలు 4 శాతం క్షీణించినట్లు వివరించింది. అలాగే, 2012లో 19,000 నూతన గృహాలు రాగా.. 2013లో ఇది 15 శాతం క్షీణించి 16,200కి పరిమితమైనట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అయినప్పటికీ, చెన్నై, పుణె వంటి ఐటీ నగరాలతో పోలిస్తే ఇక్కడ క్షీణత తక్కువేనని తెలిపింది.
దేశంలోని మిగతా రెసిడెన్షియల్ మార్కెట్ల తరహాలోనే హైదరాబాద్లోనూ మందగమనం కనిపించిందని వివరించింది. ఆర్థిక మందగమనం, అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత.. వంటి అంశాలు అనిశ్చితికి కారణమయ్యాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. హైదరాబాద్లో గత రెండేళ్లుగా విక్రయాలు దాదాపు ఒకే స్థాయిలో ఉంటున్నా ధరల విషయంలో పెద్దగా మార్పుల్లేవని వెల్లడించింది. ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్కతా తదితర టాప్ ఏడు నగరాల్లోని రెసిడెన్షియల్ మార్కెట్లలో ఇప్పటికీ హైదరాబాద్లో మాత్రమే అత్యంత అందుబాటు ధరల్లో గృహాలు లభిస్తున్నాయని తెలిపింది. 2009 నుంచి చూస్తే బెంగళూరు, పుణె, చెన్నై వంటి ఐటీ ఆధారిత మార్కెట్లలో సగటున ధరలు 38 శాతం మేర పెరగ్గా.. హైదరాబాద్లో 13 శాతం స్థాయిలోనే పెరుగుదల ఉందని నైట్ ఫ్రాంక్ నివేదికలో వివరించింది.
హైదరాబాద్లో 4% తగ్గిన ఇళ్ల అమ్మకాలు
Published Thu, Mar 6 2014 1:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement