♦ రిటైల్ ఇన్వెస్టర్లలో 85 శాతం మంది మొగ్గు
♦ ఆ తర్వాతే మ్యూచువల్ ఫండ్స్ వైపు చూపు
♦ కరెక్షన్ కోసం చూస్తున్న 65 శాతం మంది
♦ డెరివేటివ్స్, డే ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువ
♦ జియోజిత్ సర్వేలో ఇన్వెస్టర్ల వెల్లడి
ముంబై: రిటైల్ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తొలి చాయిస్ షేర్లే. ఇతర పెట్టుబడి సాధనాల కంటే షేర్లకే వారు తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు బ్రోకింగ్ సంస్థ జియోజిత్ సెక్యూరిటీస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మిగులు నగదు ఉన్నప్పుడే తాము స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటామని ఎక్కువమంది స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల అవగాహన కోసం సెబీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఫలితాలివ్వటం మొదలెట్టాయని, దలాల్ స్ట్రీట్ను ఇవి చక్కని పనితీరుగల మార్కెట్గా మార్చాయని సర్వే ప్రశంసించింది. నిఫ్టీ, సెన్సెక్స్ ఈ ఏడాది 18 శాతానికి పైగా పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. సెన్సెక్స్ ఇటీవల 30,000 మార్కును దాటడంతో కోచికి చెందిన జియోజిత్ సెక్యూరిటీస్ ఆన్లైన్ వేదికగా 3 లక్షల మంది ఇన్వెస్టర్లతో సర్వే నిర్వహించింది.
కాగా సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది తమ మిగులు ఆదాయంలో 20 శాతం వరకు ఈక్విటీలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నిజానికి దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభాలను ఆర్జించినట్టు చూపే గణాంకాలు అందుబాటులో లేవు. ఎందుకంటే వీరు మార్కెట్ల బూమ్లో ఉన్నపుడు ప్రవేశించడం, కరెక్షన్కు గురవగానే నష్టాలతో బయటకు వెళ్లిపోవడం జరుగుతుంటుంది.
సర్వేలో వెల్లడైన అంశాలివీ...
⇔ నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాం: 83.45 శాతం
⇔ మిగులు నిధులున్నపుడే స్టాక్ మార్కెట్లో పెడతాం: 59.25 శాతం
⇔ నెలనెలా ఇన్వెస్ట్ చేస్తాం: 20 శాతం
⇔ కొంత మొత్తాన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం: 57.21 శాతం
⇔ నేరుగా ఈక్విటీల్లో పెడితేనే మంచి రాబడులొస్తాయి: 65.5 శాతం
⇔ ఈక్విటీల్లో రిస్కుంటుంది కనక మ్యూచువల్ ఫండ్లే నయం: 24 శాతం
⇔ డెరివేటివ్స్ అంటే అధిక రిస్కుంటుంది. కాబట్టి దాన్లో పెట్టం: 20 శాతం
⇔ కాస్తంత రిస్క్ ఉన్నా డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం: 4.76 శాతం
⇔ డే ట్రేడింగ్ అంటే చాలా రిస్కుంటుంది. కాబట్టి మేం దూరంగా ఉంటాం: 62%
⇔ లాభం వెనక నష్టం కూడా ఉంటుంది. అయినా డే ట్రేడింగ్ చేస్తాం: 14.55%
⇔ మార్కెట్లలో కరెక్షన్ వస్తే దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తాం. వేచి చూస్తున్నాం: 65%
షేర్లంటే మాకెంతో ఇష్టం!
Published Thu, Jul 20 2017 12:13 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సాక్షి కార్టూన్ 10-05-2024
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement